Telugu Global
NEWS

రాజ్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు

జవహార్‌ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో జరుగుతున్న ఆందోళనపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేఎన్‌యూ ఆందోళనల వెనుక పాక్‌ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా చీఫ్ సయూద్‌ హస్తముందని వెల్లడించారు. సయూద్ ప్రోద్బలంతోనే జేఎన్‌యూలో భారత వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. పార్లమెంటు దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురుకు అనుకూలంగా జేఎన్‌యూలో కార్యక్రమం నిర్వహించడం, అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేయడం వంటి వ్యవహారంతో […]

రాజ్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు
X

జవహార్‌ లాల్ నెహ్రూ యూనివర్శిటీలో జరుగుతున్న ఆందోళనపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జేఎన్‌యూ ఆందోళనల వెనుక పాక్‌ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా చీఫ్ సయూద్‌ హస్తముందని వెల్లడించారు. సయూద్ ప్రోద్బలంతోనే జేఎన్‌యూలో భారత వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

పార్లమెంటు దాడి కేసులో దోషి అయిన అఫ్జల్ గురుకు అనుకూలంగా జేఎన్‌యూలో కార్యక్రమం నిర్వహించడం, అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేయడం వంటి వ్యవహారంతో రచ్చ మొదలైంది. ఈ చర్యలకు పాల్పడిన విద్యార్థినాయకులను అరెస్టు చేయడంపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.

ఈ వ్యవహారంలో ఒకవైపు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరోవైపు ప్రతిపక్ష పార్టీలు మాటల యుద్ధానికి దిగాయి. ఈ నేపథ్యంలో రాజ్ నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ ‘జవహార్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఏం జరిగిందో దాని వెనుక లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ మద్దతు ఉంది. నేను అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడైతే భారత్కు వ్యతిరేకంగా నినాదాలు పెల్లుబుకుతాయో వాటిపై మాట్లాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఈ విషయంలో దోషులను కఠినంగా శిక్షిస్తాం. నిర్దోషులకు ఎలాంటి హానీ జరగదు’ అని రాజ్ నాథ్ అన్నారు. అయితే రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీలు విశ్వసించడం లేదు.

First Published:  14 Feb 2016 5:38 AM GMT
Next Story