Telugu Global
Cinema & Entertainment

మెగా ఫ్యామిలీకి పట్టిన రీమేక్ పిచ్చి...

మెగా హీరోలందరికీ ఇప్పుడు వరుసగా రీమేకుల ఫీవర్ పట్టుకుంది. ఎవర్ని కదిపినా అంతా రీమేకులు అంటున్నారు. ఇదేదో వైరస్ లా అందరికీ ఒకేసారి వ్యాపించేసింది. మెగాస్టార్ నుంచి కుర్ర స్టార్ వరకు అందరూ రీమేక్ సినిమాల్నే కలవరిస్తున్నారు. చిరంజీవి త్వరలోనే తన 150వ సినిమాగా కత్తి రీమేక్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. దీనికి దర్శకుడు వీవీ వినాయక్ తుది మెరుగులు దిద్దుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక పవన్ కల్యాణ్ కూడా తాజాగా ఓ రీమేక్ […]

మెగా ఫ్యామిలీకి పట్టిన రీమేక్ పిచ్చి...
X
మెగా హీరోలందరికీ ఇప్పుడు వరుసగా రీమేకుల ఫీవర్ పట్టుకుంది. ఎవర్ని కదిపినా అంతా రీమేకులు అంటున్నారు. ఇదేదో వైరస్ లా అందరికీ ఒకేసారి వ్యాపించేసింది. మెగాస్టార్ నుంచి కుర్ర స్టార్ వరకు అందరూ రీమేక్ సినిమాల్నే కలవరిస్తున్నారు. చిరంజీవి త్వరలోనే తన 150వ సినిమాగా కత్తి రీమేక్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు. దీనికి దర్శకుడు వీవీ వినాయక్ తుది మెరుగులు దిద్దుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక పవన్ కల్యాణ్ కూడా తాజాగా ఓ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
తమిళ్ లో హిట్టయిన వేదాలమ్ సినిమాను….సూర్య మూవీస్ బ్యానర్ పై చేసేందుకు పవన్ ఒప్పుకున్నాడు. వీళ్లిద్దరి తోపాటు చిరు తనయుడు రామ్ చరణ్ కూడా రీమేక్ నే నమ్ముకున్నాడు. తమిళనాట హిట్టయిన థని ఒరువున్ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రేపోమాపో ఇది పట్టాలపైకి రాబోతోంది. ఇప్పుడీ లిస్ట్ లోకి సాయిధర్మతేజ కూడా చేరాడు. కన్నడలో హిట్టయిన మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి సినిమాపై సాయిధర్మతేజ మనసుపడ్డాడట. త్వరలోనే దీనిపై ఓ ప్రకటన చేయబోతున్నాడు. ఇక లిస్ట్ లో మిగిలింది బన్నీ ఒక్కడే. అతడు కూడా ఓ రీమేక్ కు ఓకే చెప్పేస్తే… ఓ పనైపోతుంది.
First Published:  9 Feb 2016 4:55 AM GMT
Next Story