పవన్ ప్రశ్నిస్తారనుకున్నా.. అభిమాని సూసైడ్ నోట్
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్లో కలకలం రేగింది. చిక్కాల వెంకటరమణమూర్తి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. కలెక్టరేట్లోని ఒక భవనం వద్ద టీవీ డిష్ వైర్కు ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మృతదేహాన్ని కిందకు దింపారు. మృతుడి జేబులో ఆత్మహత్య లేఖను గుర్తించారు. కాపులను బీసీల్లోకి చేర్చాలని అందులో వెంకటరమణ కోరారు. పవన్ కల్యాణ్ కాపులకు ఏదో న్యాయం చేస్తారని ఇన్ని రోజులు ఎదురుచూశానన్నారు. కానీ చివరకు ఎదురుచూపులే మిగిలాయని […]
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్లో కలకలం రేగింది. చిక్కాల వెంకటరమణమూర్తి అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు. కలెక్టరేట్లోని ఒక భవనం వద్ద టీవీ డిష్ వైర్కు ఉరేసుకుని ప్రాణం తీసుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి మృతదేహాన్ని కిందకు దింపారు.
మృతుడి జేబులో ఆత్మహత్య లేఖను గుర్తించారు. కాపులను బీసీల్లోకి చేర్చాలని అందులో వెంకటరమణ కోరారు. పవన్ కల్యాణ్ కాపులకు ఏదో న్యాయం చేస్తారని ఇన్ని రోజులు ఎదురుచూశానన్నారు. కానీ చివరకు ఎదురుచూపులే మిగిలాయని లేఖలో రాశారు. జనసేన ప్రశ్నించే పార్టీ అన్నారు కానీ ప్రశ్నల్లేని పార్టీగా మిగిలిపోయిందని లేఖలో ఆవేదన చెందారు.
కాపు గర్జన ద్వారానైనా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా అని లేఖలో రాశాడు. మృతుడి వయసు 50 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు. వెంకటరమణ కాకినాడ డెయిరీ ఫాం సెంటర్ డీజిల్ మెకానిక్గా భావిస్తున్నారు.
Click on Image to Read: