Telugu Global
NEWS

కాపు గర్జనలో తీవ్ర నిర్ణయం- రైలు పట్టాలపైకి కాపులు

#ఆందోళన విరమించిన ముద్రగడ- సోమవారం సాయంత్రం వరకు గడువు# తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహిస్తున్న కాపు గర్జన సభ తీవ్ర నిర్ణయం తీసుకుంది. రైలు పట్టాలపై ధర్నాకు దిగారు. సాధారణంగా సభ జరుగుతుందని భావించినా, కాపు నేత ముద్రగడ పద్మనాభం మాత్రం తన తీవ్రమైన నిర్ణయాన్ని సభ వేదిక నుంచే ప్రకటించారు. అటో ఇటో తేల్చుకునేందుకే నేడు ఈ సభ నిర్వహించామని ఇక్కడి నుంచి నేరుగా రైలు పట్టాలపైకి, రోడ్లపైకి వెళ్లాలని కాపులకు పిలుపునిచ్చారు. దీంతో వేలాది మంది కాపులు […]

కాపు గర్జనలో తీవ్ర నిర్ణయం- రైలు పట్టాలపైకి కాపులు
X

#ఆందోళన విరమించిన ముద్రగడ- సోమవారం సాయంత్రం వరకు గడువు#

తూర్పుగోదావరి జిల్లా తునిలో నిర్వహిస్తున్న కాపు గర్జన సభ తీవ్ర నిర్ణయం తీసుకుంది. రైలు పట్టాలపై ధర్నాకు దిగారు. సాధారణంగా సభ జరుగుతుందని భావించినా, కాపు నేత ముద్రగడ పద్మనాభం మాత్రం తన తీవ్రమైన నిర్ణయాన్ని సభ వేదిక నుంచే ప్రకటించారు. అటో ఇటో తేల్చుకునేందుకే నేడు ఈ సభ నిర్వహించామని ఇక్కడి నుంచి నేరుగా రైలు పట్టాలపైకి, రోడ్లపైకి వెళ్లాలని కాపులకు పిలుపునిచ్చారు. దీంతో వేలాది మంది కాపులు పక్కనే ఉన్న రైలు పట్టాలపై ఆందోళనకు దిగారు. ముద్రగడ పద్మనాభం స్వయంగా రైలుకు అడ్డంగా కూర్చున్నారు.

fire-newkapu

బీసీల్లోకి కాపులను చేరుస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవోలు విడుదల చేసేంత వరకు ఇంటి మొహం చూడకూడదని ముద్రగడ పిలుపునిచ్చారు. 15 నిమిషాల పాటు ప్రసంగించిన ముద్రగడ ”పదండి పట్టాలపైకి వెళ్దామంటూ ” ప్రసంగాన్ని ముగించారు. అనంతరం అక్కడి నుంచి వెళ్లి రైలు పట్టాలపై కూర్చుకున్నారు. రాత్రి ముద్రగడ ఆందోళన విరమించారు. సోమవారం సాయంత్రం లోపు రిజర్వేషన్లపై స్పష్టమైన ప్రకటన చేయకుంటే అమరణ దీక్షకు దిగుతానని ప్రకటించారు.

Click on Image to read

కాపు గర్జనలో ఉద్రిక్తత- రైళ్లపై రాళ్ల దాడి

కేసీఆర్ భార్యకే అర్థం కావ‌డం లేదట‌ ..

వదినకు నిజాయితీ ఉంది.. మాట ఇచ్చింది

సీఎం కుమారుడికి అక్రమ సంబంధం

వైసీపీలోకి హరి- ఈ ప్రచారం వెనుక ఇంత ఉందా?!

కేటీఆర్‌కు ప్రమోషన్ ప్రకటించిన కేసీఆర్

బాలకృష్ణ ఓటేసి వారు సిగ్గుపడుతున్నారట!

వర్మ వివాదాస్పద ట్వీట్- రాధాపై తీవ్ర వ్యాఖ్యలు

First Published:  31 Jan 2016 4:27 AM GMT
Next Story