Telugu Global
Others

రామోజీ, రజినీలకు పద్మ అవార్డ్...

2016కు గాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 118 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేశారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు పద్మ విభూషణ్ అవార్డ్ వరించింది. మీడియా విభాగం నుంచి ఆయనకు పద్మవిభూషణ్‌ దక్కింది. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కూడా పద్మవిభూషణ్ దక్కింది. దర్శకుడు రాజమౌళికి పద్మశ్రీ అవార్డు వరించింది.  వీరితో పాటు పండిట్ శ్రీశ్రీ రవిశంకర్, సంగీత విద్వాంసురాలు గిరిజాదేవీకి పద్మ విభూషణ్ ప్రకటించారు. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్, సైనా నెహ్వాల్, సానియా […]

రామోజీ, రజినీలకు పద్మ అవార్డ్...
X

2016కు గాను కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 118 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేశారు. ఈనాడు సంస్థల అధినేత రామోజీరావుకు పద్మ విభూషణ్ అవార్డ్ వరించింది. మీడియా విభాగం నుంచి ఆయనకు పద్మవిభూషణ్‌ దక్కింది. సూపర్ స్టార్ రజనీకాంత్‌కు కూడా పద్మవిభూషణ్ దక్కింది. దర్శకుడు రాజమౌళికి పద్మశ్రీ అవార్డు వరించింది. వీరితో పాటు పండిట్ శ్రీశ్రీ రవిశంకర్, సంగీత విద్వాంసురాలు గిరిజాదేవీకి పద్మ విభూషణ్ ప్రకటించారు. బాలీవుడ్ యాక్టర్ అనుపమ్ ఖేర్, సైనా నెహ్వాల్, సానియా మీర్జా, సింగర్ ఉదిత్ నారాయణ్‌, రామ్‌సుతార్, స్వామి తేజోమయానంద, ప్రొ. రామానుజ తాతా చార్, దీరూబాయ్ అంబానీ, డా. నాగేశ్వరరెడ్డిలకు పద్మ విభూషణ్ అవార్డు వరించింది. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు పద్మ శ్రీ అవార్డు ప్రకటించారు.

First Published:  25 Jan 2016 4:10 AM GMT
Next Story