బ్రాహ్మణ యువతిగా నయన ఏం చేస్తుంది..?
నయనతార ‘శ్రీరామరాజ్యం’ సినిమా తర్వాత ప్రభుదేవాను పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలైపోతుంది అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆమె సినిమాల్లో మరింత స్ట్రాంగ్గా నిలదొక్కుకుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలతో ముందుకెళ్తోంది. ‘మాయ’, ‘తని ఒరువన’, ‘నానుమ్ రౌడీదాన్’ సినిమాలతో హిట్ కొట్టి 2015లో హ్యాట్రిక్ హిట్ కొట్టిన భామగా తమిళనాడులో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ భామ మారుతి దర్శకత్వంలో వెంకటేష్ పక్కన ఓ తెలుగు చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో […]
BY sarvi23 Jan 2016 7:04 PM GMT
X
sarvi Updated On: 23 Jan 2016 11:35 PM GMT
నయనతార ‘శ్రీరామరాజ్యం’ సినిమా తర్వాత ప్రభుదేవాను పెళ్లి చేసుకుని జీవితంలో సెటిలైపోతుంది అని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఆమె సినిమాల్లో మరింత స్ట్రాంగ్గా నిలదొక్కుకుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు వైవిధ్యమైన పాత్రలతో ముందుకెళ్తోంది. ‘మాయ’, ‘తని ఒరువన’, ‘నానుమ్ రౌడీదాన్’ సినిమాలతో హిట్ కొట్టి 2015లో హ్యాట్రిక్ హిట్ కొట్టిన భామగా తమిళనాడులో మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ భామ మారుతి దర్శకత్వంలో వెంకటేష్ పక్కన ఓ తెలుగు చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా సింపుల్గా, కాస్త డీ గ్లామరైజ్డ్గా ఉంటుందట. బ్రాహ్మణ యువతిగా ఈ సినిమాలో కనిపించనుందట నయనతార.
మరోవైపు తమిళంలో కార్తీ సరసన చేస్తున్న ‘కాశ్మోరా’లో యువరాణి పాత్రలో మెప్పించనుంది. ఓ వైపు ఆడంబరంగా రాణిపాత్రలో, మరోవైపు నిరాడంబరంగా డీ గ్లామరైజ్డ్ పాత్రలో ఒకేసారి నటిస్తోందీ అమ్మడు. ‘‘సినిమాల్లో నాకు పెద్దగా స్నేహితులు లేరు. నాకు అంత తీరిక కూడా ఉండటం లేదు. మేక్ప-ప్యాకప్, స్ర్కిప్ట్లతోనే సరిపోతోంది. అందువల్ల నా స్నేహం కూడా వృత్తితోనే’’ అని చెప్పుకొచ్చింది నయనతార. ప్రస్తుతం ఈ భామ తమిళంలో ‘ఇదు నమ్మ ఆళు’, ‘తిరునాళ్’, ‘కాశ్మోరా’, ‘ఇరు ముగన’తో పాటు సర్గుణం రూపొందిస్తున్న ఓ సినిమాలోనూ నటిస్తోంది. మలయాళంలో ‘పుదియ నియమం’లో కీలక పాత్ర పోషిస్తోందీ కేరళ కుట్టి.
Next Story