Telugu Global
Cinema & Entertainment

ఇరుక్కోవడానికి ఎవరూ లేరిక్కడ?

మల్టీస్టారర్స్ తీయడంలో మణిరత్నంది డిఫరెంట్ స్టయిల్. ఇద్దరు ముగ్గురు హీరోల్ని చక్కగా తన సినిమాల్లో ఇరికించేస్తుంటాడు మణి. అదే కాన్ఫిడెన్స్ తో మరో మల్టీస్టారర్ సిద్ధంచేశాడు. కానీ ఈసారి ఇరికించుకోవడానికి హీరోలు ఎవరూ సిద్ధపడలేదు. మొదట నాగార్జున-మహేష్ బాబుతో ప్లాన్ చేశాడు. అది వర్కవుట్ కాకపోవడంతో…. కార్తి-దుల్కర్ సుమన్ హీరోలుగా అదే సినిమాను తీయాలనుకున్నాడు. కానీ సడెన్ గా ఆ ప్రాజెక్ట్ నుంచి దుల్కర్ సుమన్ కూడా జంప్ అయ్యాడు. తర్వాత ఎలాగోలా కార్తీని పెట్టి సినిమాను […]

ఇరుక్కోవడానికి ఎవరూ లేరిక్కడ?
X
మల్టీస్టారర్స్ తీయడంలో మణిరత్నంది డిఫరెంట్ స్టయిల్. ఇద్దరు ముగ్గురు హీరోల్ని చక్కగా తన సినిమాల్లో ఇరికించేస్తుంటాడు మణి. అదే కాన్ఫిడెన్స్ తో మరో మల్టీస్టారర్ సిద్ధంచేశాడు. కానీ ఈసారి ఇరికించుకోవడానికి హీరోలు ఎవరూ సిద్ధపడలేదు. మొదట నాగార్జున-మహేష్ బాబుతో ప్లాన్ చేశాడు. అది వర్కవుట్ కాకపోవడంతో…. కార్తి-దుల్కర్ సుమన్ హీరోలుగా అదే సినిమాను తీయాలనుకున్నాడు. కానీ సడెన్ గా ఆ ప్రాజెక్ట్ నుంచి దుల్కర్ సుమన్ కూడా జంప్ అయ్యాడు. తర్వాత ఎలాగోలా కార్తీని పెట్టి సినిమాను ప్రారంభించాడు. కార్తి-నాని హీరోలుగా తెరకెక్కిద్దామనుకున్నాడు. కానీ అది కూడా వర్కవుట్ కాలేదు. ఈ గ్యాప్ లో కార్తి కూడా జంప్ అయ్యాడు. దీంతో తాజాగా ఇప్పుడు నాగచైతన్య-రానా హీరోలుగా ఈ సినిమాను తీద్దామని అనుకుంటున్నాడట మణిరత్నం. రానా కూడా వెనక్కుతగ్గుతున్నట్టు పీలర్ రావడంతో మణి ఉలిక్కిపడ్డారు. అందుకే ఈమధ్యే నిర్మాత సురేష్ బాబును కలిసి కథ కూడా వినిపించాడట. సురేష్‌ బాబు వైపు నుంచి నరుక్కోస్తే పని అయిపోతుందని ఆయన అనుకుని ఉండవచ్చు. అసలు విషయం తెలియాలంటే మణిరత్నం భార్య సుహాసిని నోరు విప్పాల్సిందే. ఎందుకంటే… ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి తొలి నుంచి అప్ డేట్స్ ఇస్తోంది సుహాసినే.
First Published:  21 Jan 2016 1:04 AM GMT
Next Story