Telugu Global
Cinema & Entertainment

'నాన్నకు ప్రేమతో ' ఎఫెక్ట్: స్టేజ్ ఎక్కితే ఏడిచేస్తున్నారు

‘ఇదంతా ‘నాన్నకు ప్రేమతో ‘ ఆడియో ఫంక్షన్ నుండి మొదలయ్యింది. ఆ ఈవెంట్‌లో ఏడవని సెలెబ్ లేరు. దేవిశ్రీ ప్రసాద్ మొదలుకుని.. ఎన్.టి.ఆర్., సుకుమార్ వరకు అందరూ ఎమోషనల్ అయిపోయారు. అందరూ తమ తమ నాన్నలను గుర్తు చేసుకుని.. నాన్నకు ఋణపడిపోయామని తెగ ఇదయిపోయారు. అంతా బాగనే ఉంది. కానీ ఆ తర్వాత. ఏ ఫంక్షన్.. లేదా ఈవెంట్ జరిగినా సినిమా యూనిట్ అంతా ఎమోషనల్ అయిపోతున్నారు. మొదట్లో ఇదంతా బాగానే ఉన్నా. ఇప్పుడు కాస్త జాస్తి […]

నాన్నకు ప్రేమతో  ఎఫెక్ట్: స్టేజ్ ఎక్కితే ఏడిచేస్తున్నారు
X

‘ఇదంతా ‘నాన్నకు ప్రేమతో ‘ ఆడియో ఫంక్షన్ నుండి మొదలయ్యింది. ఆ ఈవెంట్‌లో ఏడవని సెలెబ్ లేరు. దేవిశ్రీ ప్రసాద్ మొదలుకుని.. ఎన్.టి.ఆర్., సుకుమార్ వరకు అందరూ ఎమోషనల్ అయిపోయారు. అందరూ తమ తమ నాన్నలను గుర్తు చేసుకుని.. నాన్నకు ఋణపడిపోయామని తెగ ఇదయిపోయారు. అంతా బాగనే ఉంది. కానీ ఆ తర్వాత. ఏ ఫంక్షన్.. లేదా ఈవెంట్ జరిగినా సినిమా యూనిట్ అంతా ఎమోషనల్ అయిపోతున్నారు. మొదట్లో ఇదంతా బాగానే ఉన్నా. ఇప్పుడు కాస్త జాస్తి అయ్యిందని అనిపిస్తోందని అనే టాక్ వినిపిస్తోంది. ‘నాన్నకు ప్రేమతో ‘ టైటిల్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ సంక్రాంతి తర్వాత రోజు జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ ఇటీవల పరమపదించిన తన తండ్రి సత్యమూర్తిని తలచుకుంటూ రాసిన లిరిక్స్ అందరినీ కదిలించే విధంగా ఉన్నాయి అనడంలో సందేహం లేదు. కానీ.. మళ్ళీ అందరూ ఎమోషనల్ అయిపోయి… అదే సీన్ రిపీట్ చేసారు.

First Published:  16 Jan 2016 7:03 PM GMT
Next Story