Telugu Global
CRIME

అనంతలో దారుణం- వివస్త్రను చేసి సాప్ట్‌వేర్ ఉద్యోగినిపై దాడి.. వంతపాడిన ఎస్‌ఐలు

అనంతపురం శివారులోని పాపంపేటలో మహిళా సాప్ట్‌వేర్ ఉద్యోగిని సుష్మాపై దాడి ఘటనలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. దాడి వెనుక ఇద్దరు ఎస్‌ఐల హస్తం కూడా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈనెల 12న సుస్మాతో పాటు ఆమె తల్లిదండ్రులపై దాదాపు 20 మంది వచ్చి దాడి చేశారు. ఇంటి వద్ద ప్రహారి గోడ విషయంలో ఈ దాడి జరిగింది. వివాదంపై కొద్ది రోజుల క్రితమే స్థానిక పట్టణ సీఐకి సుష్మా కుటుంబం ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ శుభకుమార్ […]

అనంతలో దారుణం- వివస్త్రను చేసి సాప్ట్‌వేర్ ఉద్యోగినిపై దాడి.. వంతపాడిన ఎస్‌ఐలు
X

అనంతపురం శివారులోని పాపంపేటలో మహిళా సాప్ట్‌వేర్ ఉద్యోగిని సుష్మాపై దాడి ఘటనలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. దాడి వెనుక ఇద్దరు ఎస్‌ఐల హస్తం కూడా ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈనెల 12న సుస్మాతో పాటు ఆమె తల్లిదండ్రులపై దాదాపు 20 మంది వచ్చి దాడి చేశారు. ఇంటి వద్ద ప్రహారి గోడ విషయంలో ఈ దాడి జరిగింది. వివాదంపై కొద్ది రోజుల క్రితమే స్థానిక పట్టణ సీఐకి సుష్మా కుటుంబం ఫిర్యాదు చేసింది. దీంతో సీఐ శుభకుమార్ బాధ్యులను పిలిపించి విచారించి పంపించివేశారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎస్‌ఐలు కాంత్రికుమార్, హమీద్ ఖాన్ అవతలి వర్గాన్ని ఉసిగొల్పి సుష్మా ఇంటిపైకి పంపించారు.

ఎస్‌ఐల అండ చూసుకుని నారాయణమ్మ, శ్రీకాంత్, హరి, శివప్రసాద్‌, నలినిలు రెచ్చిపోయారు. సుష్మాను వీధిలోకి ఈడ్చుకొచ్చి తీవ్రంగా గాయపరిచారు. వివస్త్రను చేసి అవమానించారు. ప్రస్తుతం సుష్మా, ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇద్దరు ఎస్‌ఐలు, సీఐ కలిసి తమ కుటుంబాన్ని అన్యాయం చేస్తున్నారని బాధితులు ఆవేదన చెందుతున్నారు. సుష్మా బెంగళూరులో నోబుల్ సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో ఇంజినీర్‌గా పని చేస్తోంది.

First Published:  14 Jan 2016 11:26 PM GMT
Next Story