Telugu Global
Others

వైసీపీని ఐదుగురు ఎమ్మెల్యేలు వీడుతున్నారా?

వైసీపీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారని 18 నెలలుగా ప్రచారం సాగుతోంది. కానీ ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే కూడా సైకిల్ ఎక్కలేదు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారంటున్న ప్రచారం జరుగుతోంది. ఇందుకు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ టీడీపీకి అండగా నిలిచే ప్రముఖ పత్రిక ప్రచురించింది. బుధవారం కర్నూలు జిల్లాలో జరిగిన జన్మభూమిలో పాల్గొన్న చంద్రబాబు… ఆదే సమయంలో జిల్లా నేతలకు ఈ విషయాన్ని చెప్పారని […]

వైసీపీని  ఐదుగురు ఎమ్మెల్యేలు వీడుతున్నారా?
X

వైసీపీకి చెందిన చాలామంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారని 18 నెలలుగా ప్రచారం సాగుతోంది. కానీ ఇప్పటి వరకు ఒక్క ఎమ్మెల్యే కూడా సైకిల్ ఎక్కలేదు. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతారంటున్న ప్రచారం జరుగుతోంది. ఇందుకు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ టీడీపీకి అండగా నిలిచే ప్రముఖ పత్రిక ప్రచురించింది. బుధవారం కర్నూలు జిల్లాలో జరిగిన జన్మభూమిలో పాల్గొన్న చంద్రబాబు… ఆదే సమయంలో జిల్లా నేతలకు ఈ విషయాన్ని చెప్పారని సదరు పత్రిక కథనం సారాంశం. ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీలోకి వస్తున్నారని కాబట్టి ఆయా నియోజకవర్గాల్లోని ఇన్‌చార్జ్‌లు సర్దుకుపోవాలని చంద్రబాబు సూచించారట. ఈ విషయంపై జిల్లా నేతలతో దాదాపు గంటన్నరపాటు చంద్రబాబు మంతనాలు జరిపారని చెబుతున్నారు. టీడీపీలోకి వస్తున్న వారిలో ఆదోని డివిజన్‌కు చెందిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారట. కర్నూలు డివిజన్ నుంచి ఒక వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారని చెబుతున్నారు. అది కూడా సంక్రాంతిలోపే ఈ చేరికలుంటాయని చెబుతున్నారు. అంటే ఇది ఎంతవరకు నిజమో కొద్ది రోజుల్లోనే తేలిపోతుందన్న మాట.

Click to Read:

JC-Diwakar-reddy

CBN-in-Karnool-meeting

DL-Ravindra-Reddy-1

First Published:  6 Jan 2016 10:20 PM GMT
Next Story