Telugu Global
Others

చచ్చినా నాకు పదవి రాదు... పోలవరం పూర్తికాదు

ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడంలో ముందుండే జేసీ దివాకర్ రెడ్డి ఈసారి ఆయన మంత్రిపదవిపై మాట్లాడారు. ”నేను చచ్చినా చంద్రబాబు నాకు మంత్రి పదవి ఇవ్వరు” అని వ్యాఖ్యానించారు. ఆ విషయంలో తనకు స్పష్టత ఉందని చెప్పారు. ”నేను చస్తేగానీ మంత్రి పదవి ఇవ్వరా” అని చంద్రబాబుతోనూ అన్నానని జేసీ చెప్పారు. తనకు అదృష్టం లేదని అందుకే మంత్రి పదవి రాలేదన్నారు.  చంద్రబాబుకు అదృష్టం  ఉంది కాబట్టే ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. అయితే ఎంపీగా ఉన్న జేసీ మంత్రి పదవి అడిగారంటే […]

చచ్చినా నాకు పదవి రాదు... పోలవరం పూర్తికాదు
X

ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడంలో ముందుండే జేసీ దివాకర్ రెడ్డి ఈసారి ఆయన మంత్రిపదవిపై మాట్లాడారు. ”నేను చచ్చినా చంద్రబాబు నాకు మంత్రి పదవి ఇవ్వరు” అని వ్యాఖ్యానించారు. ఆ విషయంలో తనకు స్పష్టత ఉందని చెప్పారు. ”నేను చస్తేగానీ మంత్రి పదవి ఇవ్వరా” అని చంద్రబాబుతోనూ అన్నానని జేసీ చెప్పారు. తనకు అదృష్టం లేదని అందుకే మంత్రి పదవి రాలేదన్నారు. చంద్రబాబుకు అదృష్టం ఉంది కాబట్టే ముఖ్యమంత్రి అయ్యారని చెప్పారు. అయితే ఎంపీగా ఉన్న జేసీ మంత్రి పదవి అడిగారంటే ఏకంగా కేంద్ర మంత్రి పదవి మీదే ఆశలు పెట్టుకున్నారా అన్నది ప్రశ్న. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైనా జేసీ స్పందించారు. తాను పుట్టినప్పుటి నుంచి పోలవరం ప్రాజెక్టు గురించి వింటున్నానని చెప్పారు. అది పూర్తవుతుందన్న నమ్మకం తనకు లేదన్నారు.

గతంలో చంద్రబాబు కేంద్రంలో చంద్రబాబుకు ఏది చెబితే జరిగేదని ,ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. ఎంపీలు,ఎమ్మెల్యేలు టిఏ ,డిఏలు తీసుకోవడానికేనన్నట్లుగా పరిస్థితి తయారైందన్నారు. కేంద్రంలో పూర్తి స్థాయి మెజారిటీ ఉండడంతో ఎవరూ గట్టిగా మోదీని నిలదీయలేకపోతున్నారన్నారు.

First Published:  6 Jan 2016 9:32 PM GMT
Next Story