పవన్ మాట కాదనలేక పోయినట్లున్నాడు
త్రివిక్రమ్ -నితిన్ ల కలయికలో ఆ ఆ రూపొందుతున్న సంగతి తెలిసిందే. సమంత కథానాయికగా నటిస్తొంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ అతిథి పాత్రలో కనిపిస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ -త్రివిక్రమ్ ఆప్త మిత్రులు. వీరిద్దరి కలయికలో జల్సా అత్తారింటికి దారేది చిత్రాలొచ్చాయి. అవి రెండూ ఘన విజయాలు సాధించాయి. కోబలి కథ కూడా సిద్దమైంది. 2016 లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ లోగా పవన్ ఆఆ చిత్రంలో కనిపిస్తాడని గుసగుసలు […]
త్రివిక్రమ్ -నితిన్ ల కలయికలో ఆ ఆ రూపొందుతున్న సంగతి తెలిసిందే. సమంత కథానాయికగా నటిస్తొంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ అతిథి పాత్రలో కనిపిస్తారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పవన్ -త్రివిక్రమ్ ఆప్త మిత్రులు. వీరిద్దరి కలయికలో జల్సా అత్తారింటికి దారేది చిత్రాలొచ్చాయి. అవి రెండూ ఘన విజయాలు సాధించాయి. కోబలి కథ కూడా సిద్దమైంది. 2016 లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ లోగా పవన్ ఆఆ చిత్రంలో కనిపిస్తాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఓ చిన్న పాత్రలో తళుక్కున మెరుస్తారట. త్రివిక్రమ్ తో ఉన్న సాన్నిహిత్యంతో పాటు , నితిన్ పై ఉన్న అభిమానం కొద్దీ ఈ పాత్ర చేయడానికి పవన్ ఒప్పుకున్నారని తెలుస్తోంది. పవన్ తో అతిథి పాత్ర చేయించడం వీలు కాక పోతే , కనీసం వాయిస్ ఓవర్ అయిన ఆ చెప్పించాలని చిత్ర బృందం ప్రయత్నిస్తుంది. రెండింటిలో ఒకటి ఖాయంగా కనిపిస్తుంది.2016 ఫిబ్రవరిలో ఈ చిత్రం విడుదల కానుంది. మొత్తం తన అభిమాని కోసం పవన్ అతిథి రోల్ కు నో అనలేక పోయారన్నమాట! దీంతో నితిన్ అంటే నిజంగా పవన్ కు ఉన్న అభిమానం మరోసారి వ్యక్తం అయినట్లు అయ్యింది. గతంలో ఇష్క్ సినిమా ఆడియో రిలీజ్ కు వచ్చి..తన అభిమానులకు నితిన్ చిత్రాన్ని సపోర్ట్ చేయండని దీవించిన విషయం తెలిసిందే.