Telugu Global
Others

వైసీపీలో రామసుబ్బారెడ్డి ? జగన్‌తో బంధువుల మంతనాలు

జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరడం దాదాపు ఖాయమని వార్తలొస్తున్న వేళ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి వెళ్తే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తారని చెబుతున్నారు. ఇందుకు బలం చేకూరుస్తూ ఆదివారం జగన్‌ జమ్మలమడుగు పర్యటనలో రామసుబ్బారెడ్డి బంధువులు వైసీపీ అధినేతను కలిశారు. పెద్దముడియం మండలం బోడితిత్తరపాడు టీడీపీ నాయకుడు, రామసుబ్బారెడ్డి దగ్గరి బంధువు అయిన రామలింగేశ్వరరెడ్డి జగన్‌ను కలిశారు. Click to Read: ఎమ్మెల్యే లేకుండానే జగన్ బలప్రదర్శన రామలింగేశ్వరరెడ్డితో […]

వైసీపీలో రామసుబ్బారెడ్డి ? జగన్‌తో బంధువుల మంతనాలు
X

జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టీడీపీలో చేరడం దాదాపు ఖాయమని వార్తలొస్తున్న వేళ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి వెళ్తే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తారని చెబుతున్నారు. ఇందుకు బలం చేకూరుస్తూ ఆదివారం జగన్‌ జమ్మలమడుగు పర్యటనలో రామసుబ్బారెడ్డి బంధువులు వైసీపీ అధినేతను కలిశారు. పెద్దముడియం మండలం బోడితిత్తరపాడు టీడీపీ నాయకుడు, రామసుబ్బారెడ్డి దగ్గరి బంధువు అయిన రామలింగేశ్వరరెడ్డి జగన్‌ను కలిశారు.

Click to Read: ఎమ్మెల్యే లేకుండానే జగన్ బలప్రదర్శన

రామలింగేశ్వరరెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులు జగన్‌ను కలిసి మంతనాలు జరిపారు. ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి వస్తే రామసుబ్బారెడ్డి పార్టీ వీడడం ఖాయమని వారు చెప్పినట్టు తెలుస్తోంది. ఆదినారాయణరెడ్డి విషయం ఏదో ఒకటి తేలితే రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని కూడా చెప్పినట్టు సమాచారం. ఒక వేళ ఆదినారాయణరెడ్డి టీడీపీలోకి వెళ్లి రామసుబ్బారెడ్డి వైసీపీలోకి వస్తే జమ్మలమడుగులో తిరిగి వైసీపీదే పైచేయి అవుతుందని భావిస్తున్నారు.

First Published:  27 Dec 2015 1:42 AM GMT
Next Story