ఆల్వాల్లో రైలు కిందపడ్డ ప్రేమజంట
హైదరాబాద్ ఆల్వాల్లో విషాదం చోటు చేసుకుంది. పెద్దలు పెళ్లికి నిరాకరించారన్న బాధతో ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోయింది. అమ్మాయి అక్కడికక్కడే చనిపోగా ప్రియుడు తీవ్ర గాయాలతో చికిత్సపొందుతున్నారు. వందనా కాలేజ్లో బీకాం సెకండియర్ చదువుతున్న శిరీషా, వెంకట్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమకు పెద్దలు అభ్యంతరం చెప్పారు. దీంతో శనివారం అల్వాల్ రైల్వేస్టేషన్కు వచ్చారు. అక్కడే చాలాసేపు కూర్చున్న ఇద్దరూ రైలు రాగానే ఒక్కసారిగా దాని కిందపడేందుకు వెళ్లారు. రైలు బలంగా ఢీకొట్టడంతో ఎగిరిపడ్డారు. శిరీషా […]
హైదరాబాద్ ఆల్వాల్లో విషాదం చోటు చేసుకుంది. పెద్దలు పెళ్లికి నిరాకరించారన్న బాధతో ప్రేమజంట రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోయింది. అమ్మాయి అక్కడికక్కడే చనిపోగా ప్రియుడు తీవ్ర గాయాలతో చికిత్సపొందుతున్నారు. వందనా కాలేజ్లో బీకాం సెకండియర్ చదువుతున్న శిరీషా, వెంకట్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమకు పెద్దలు అభ్యంతరం చెప్పారు. దీంతో శనివారం అల్వాల్ రైల్వేస్టేషన్కు వచ్చారు. అక్కడే చాలాసేపు కూర్చున్న ఇద్దరూ రైలు రాగానే ఒక్కసారిగా దాని కిందపడేందుకు వెళ్లారు. రైలు బలంగా ఢీకొట్టడంతో ఎగిరిపడ్డారు. శిరీషా అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ వెంకట్ను స్టేషన్ సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు.