Telugu Global
Cinema & Entertainment

బ‌న్నీ నెత్తిన పాలు పోసిన ప‌వ‌న్‌

స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి ఆశించిన మేర‌కు ఆడ‌క‌పోవ‌డంతో స‌రైనోడుపై బోలెడు ఆశ‌లు పెట్టుకున్నాడు అల్లు అర్జున్. బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న  సినిమా ప‌నులు ప్ర‌స్తుతం వేగంగా సాగుతున్నాయి. వేస‌విలో అయితే ప‌రీక్ష‌లు పూర్త‌యి ఉంటాయి కాబ‌ట్టి ఏప్రిల్ నెల‌లో ఈ సినిమా ఈసినిమా విడుద‌ల‌కు ముహూర్తం పెట్టుకున్నాడు బ‌న్నీ. కానీ, అదే స‌మ‌యానికి మ‌హేశ్ బ్ర‌హ్మోత్స‌వం, ప‌వ‌న్ సినిమా గబ్బ‌ర్ సింగ్ వ‌స్తుండ‌టంతో బ‌న్నీకి ఏం చేయాలో తోచ‌లేదు. ఇద్ద‌రు అగ్ర‌హీరోల‌ సినిమాల‌తో పోటీ.. త‌న సినిమా వ‌సూళ్ల‌పై […]

బ‌న్నీ నెత్తిన పాలు పోసిన ప‌వ‌న్‌
X
స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి ఆశించిన మేర‌కు ఆడ‌క‌పోవ‌డంతో స‌రైనోడుపై బోలెడు ఆశ‌లు పెట్టుకున్నాడు అల్లు అర్జున్. బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సినిమా ప‌నులు ప్ర‌స్తుతం వేగంగా సాగుతున్నాయి. వేస‌విలో అయితే ప‌రీక్ష‌లు పూర్త‌యి ఉంటాయి కాబ‌ట్టి ఏప్రిల్ నెల‌లో ఈ సినిమా ఈసినిమా విడుద‌ల‌కు ముహూర్తం పెట్టుకున్నాడు బ‌న్నీ. కానీ, అదే స‌మ‌యానికి మ‌హేశ్ బ్ర‌హ్మోత్స‌వం, ప‌వ‌న్ సినిమా గబ్బ‌ర్ సింగ్ వ‌స్తుండ‌టంతో బ‌న్నీకి ఏం చేయాలో తోచ‌లేదు. ఇద్ద‌రు అగ్ర‌హీరోల‌ సినిమాల‌తో పోటీ.. త‌న సినిమా వ‌సూళ్ల‌పై ప్ర‌భావం చూపిస్తుంద‌ని ఇంత‌కాలం బెంగ పెట్టుకున్నాడు.
ప‌వ‌న్ నిర్ణ‌యంతో ఖుషీ!
స‌రైనోడు కంటే ముందుగానే స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌, బ్ర‌హ్మోత్స‌వం రానున్నాయి. ఇదే స‌మ‌యంలో విడుద‌ల తేదీలు ఇంచుమించు ఒకే వారంలో వ‌చ్చే ప్ర‌మాదం ఏర్ప‌డింది. దీంతో ప‌వ‌న్ త‌న సినిమాను మ‌హేశ్ కి పోటీ కాకుండా ముందుగానే.. అంటే మార్చిలో విడుద‌ల చేద్దామ‌ని అనుకున్నాడు. దీంతో మ‌హేశ్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇదే నిర్ణ‌యం అల్లు అర్జున్ నెత్తిన పాలు పోసింది. ఎలాగంటే.. గ‌బ్బ‌ర్‌-2 విడుద‌లైన తరువాత బ్ర‌హ్మోత్స‌వం రానుంది. త‌రువాత 15 రోజుల త‌రువాత అంటే ఏప్రిల్ ఆఖ‌రి వారంలో స‌రైనోడును దించాల‌ని ప్లాన్ చేస్తున్నారు బ‌న్నీ నిర్మాత‌లు. మొత్తానికి మ‌న హీరోలు వారిలో అడ్జ‌స్ట్ కావ‌డం బ‌న్నీకి క‌లిసి వ‌చ్చింది.
First Published:  23 Nov 2015 7:04 PM GMT
Next Story