Telugu Global
National

రాందేవ్ నూడుల్స్

యోగా గురు బాబా రాందేవ్ కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. మ్యాగీలో హానికర పదార్థాలున్నాయన్న కారణంగా 5నెలలపాటు దేశంలో నిషేధానికి గురైంది. దీంతో పతంజలి నుంచి నూడుల్స్ మార్కెట్ లోకి తెస్తామని ప్రకటించిన రాందేవ్ బాబా అన్నట్టే చేశారు. ఎలాంటి హానికర పదార్థాలు లేని ఆర్గానిక్ నూడిల్స్ ను రాందేవ్ బాబా ఢిల్లీలో ప్రారంభించారు. స్వయంగా నూడుల్స్ ను వండి రుచి చూశారు. పతంజలి అట్టా నూడుల్స్ పేరుతో మార్కెట్లో నూడుల్స్ అమ్మబోతున్నట్టు తెలిపారు. ఈ డిసెంబరులో దాదాపు […]

రాందేవ్ నూడుల్స్
X

యోగా గురు బాబా రాందేవ్ కొత్త బిజినెస్‌లోకి అడుగుపెట్టారు. మ్యాగీలో హానికర పదార్థాలున్నాయన్న కారణంగా 5నెలలపాటు దేశంలో నిషేధానికి గురైంది. దీంతో పతంజలి నుంచి నూడుల్స్ మార్కెట్ లోకి తెస్తామని ప్రకటించిన రాందేవ్ బాబా అన్నట్టే చేశారు. ఎలాంటి హానికర పదార్థాలు లేని ఆర్గానిక్ నూడిల్స్ ను రాందేవ్ బాబా ఢిల్లీలో ప్రారంభించారు. స్వయంగా నూడుల్స్ ను వండి రుచి చూశారు.
పతంజలి అట్టా నూడుల్స్ పేరుతో మార్కెట్లో నూడుల్స్ అమ్మబోతున్నట్టు తెలిపారు. ఈ డిసెంబరులో దాదాపు 10 లక్షల షాపుల్లో పతంజలి అట్టా నూడుల్స్ దొరుకుతాయని చెప్పారు. ప్రస్తుతం హరిద్వార్ లోనే వీటి తయారీ యూనిట్ ఉందని వచ్చే ఏడాది మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలలో తయారీ యూనిట్లను ప్రారంభిస్తామని చెప్పారు. దీని వల్ల మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. మిగతా బ్రాండ్స్‌తో పోల్చితే పతంజలి ఆటా నూడుల్స్‌లో సీసం, మోనో సోడియం, గ్లూటామెట్ వంటి ప్రమాదకర పదార్థాలు లేవని రాందేవ్ బాబా ప్రకటించారు. పతంజలి ఆటా నూడుల్స్ 70గ్రాముల ప్యాకెట్ కేవలం 15 రూపాయలకే అందిస్తోంది. ఇప్పటికే రాందేవ్ బాబా నూడుల్స్ కు వినియోగదారుల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా పతంజలి ఆటా నూడుల్స్‌ను తిన్న వారు ‘రామ్ దేవ్ ఆటా నూడుల్స్ ఉండగా విదేశీ మ్యాగీ ఎందుకు దండగ’ అంటూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.
తన పేరునే బ్రాండ్‌గా ప్రమోట్ చేసుకుంటూ మిగతా కార్పోరేట్ కంపెనీలకు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమైన యోగా గురువు డిసెంబర్ నాటికి ‘శిశు కేర్’ పేరుతో పిల్లల ఆరోగ్య పరిరక్షణ మందులు, ‘బ్యూటీ కేర్’ పేరుతో మహిళలకు సౌందర్య ఉత్పత్తులు, ‘పవర్ వీటా’ పేరుతో హెల్త్ కి ఉపయోగపడే వివిధ పౌడర్లను మార్కెట్లోకి తెస్తామన్నారు. అంతేకాకుండా నైక్, అడిడాస్ కంపెనీలకు పోటీగా త్వరలోనే హెల్త్ డ్రింక్ లను కూడా రాందేవ్ బాబా మార్కెట్ లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

మ్యాగీని ఢీకొన‌బోతున్న యోగా… నూడుల్స్

యోగా గురువుగా త‌న ప్ర‌యాణం మొద‌లుపెట్టి మార్కెటింగ్ గురుగా అవ‌త‌రించారు రాందేవ్ బాబా. ఇప్ప‌టికే ఆయుర్వేద మందులతో పాటు, ఫాస్ట్ మూవింగ్ క‌న్జ్యూమ‌ర్ గూడ్స్ (ఎఫ్ఎమ్‌సిజి) పేరుతో తాత్కాలికంగా నిల‌వ ఉండే ర‌క‌ర‌కాల ఆహార‌, వ‌స్తు ఉత్ప‌త్తుల‌ను పెద్ద ఎత్తున ఉత్ప‌త్తి, మార్కెటింగ్‌ చేస్తున్నారాయ‌న‌. ఇప్పుడు స‌రికొత్త‌గా నూడుల్స్ ని తెచ్చారు. ఎప్ప‌టినుండో వార్త‌ల్లో విన‌బ‌డుతున్న ఈ ప‌తంజ‌లి ఆటా నూడుల్స్ ని లాంఛ‌నంగా మార్కెట్లోకి తీసుకువ‌చ్చే కార్య‌క్రమం పూర్త‌య్యింది. త్వ‌ర‌లో షాపుల్లోకి రానున్న ప‌తంజ‌లి నూడుల్స్ మ్యాగీకి గ‌ట్టిపోటీని ఇవ్వ‌నున్నాయి.
నూడుల్స్ త‌రువాత ప‌తంజ‌లి ఆయుర్వేద్ కంపెనీ చైల్డ్ కేర్ వ‌స్తువులు, సౌంద‌ర్య‌సాధ‌నాలు, ఆరోగ్యానికి సంబంధించిన ఉత్ప‌త్తులను మార్కెట్లోకి తీసుకురానున్న‌ద‌ని రాందేవ్ తెలిపారు. ఇప్ప‌టికే ఈ కంపెనీకి 2,007 కోట్ల రూపాయ‌ల అమ్మ‌కాల ట‌ర్నోవ‌ర్ ఉంది. వ‌చ్చే ఏడాదికి ఇది 5 వేల కోట్ల రూపాయ‌ల‌కు చేరాల‌నే ల‌క్ష్యంతో ప‌నిచేస్తున్నారు.

First Published:  17 Nov 2015 11:19 PM GMT
Next Story