Telugu Global
Others

పండుగ చేసుకున్న పాక్ మీడియా!

బిహార్‌లో బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్‌లో బాణాసంచా కాలుస్తారంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పినట్టుగానే జరుగుతోంది. పాక్‌లో బాణాసంచా అయితే కాల్చలేదుగానీ… అక్కడి మీడియా మాత్రం మోదీకి వ్యతిరేకంగా వార్తలు వండి వడ్డించి పండుగ చేసుకుంది. భారత్‌లో మోదీ పని అయిపోయిందంటూ టీవీ చానళ్లు చర్చలు పెట్టాయి. మోదీ పదవి నుంచి దిగిపోవడానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని కొందరు పాక్ మేధావులు జోస్యాలు చెప్పారు. పాక్ పత్రికలు కూడా బిహార్‌లో బీజేపీ ఓటమిని మొదటి పేజీల్లో బ్యానర్ […]

పండుగ చేసుకున్న పాక్ మీడియా!
X

బిహార్‌లో బీజేపీ ఓడిపోతే పాకిస్తాన్‌లో బాణాసంచా కాలుస్తారంటూ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా చెప్పినట్టుగానే జరుగుతోంది. పాక్‌లో బాణాసంచా అయితే కాల్చలేదుగానీ… అక్కడి మీడియా మాత్రం మోదీకి వ్యతిరేకంగా వార్తలు వండి వడ్డించి పండుగ చేసుకుంది. భారత్‌లో మోదీ పని అయిపోయిందంటూ టీవీ చానళ్లు చర్చలు పెట్టాయి. మోదీ పదవి నుంచి దిగిపోవడానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని కొందరు పాక్ మేధావులు జోస్యాలు చెప్పారు.

పాక్ పత్రికలు కూడా బిహార్‌లో బీజేపీ ఓటమిని మొదటి పేజీల్లో బ్యానర్ ఐటమ్‌గా ఇచ్చి సంబరపడ్డాయి. మోదీ బలహీనపడిపోయాడని తీర్పులు చెబుతూ వార్తలు రాశాయి. కొన్ని పత్రికలు కసి తీరా హెడ్‌లైన్స్ పెట్టాయి. బీజేపీలోనూ ఇకపై మోదీకి ఇబ్బందులు తప్పవని సరిహద్దులు దాటి వార్తలు రాసేశాయి. పక్క దేశంలో అందులోనూ ఒక రాష్ట్రంలో జరిగిన ఎన్నికలపై పాక్ మీడియా స్పందన చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.

First Published:  9 Nov 2015 1:29 PM GMT
Next Story