Telugu Global
Cinema & Entertainment

బాహుబలి-2పై పుకార్లు నిజమేనా..?

బాహుబలి పార్ట్-2 ఇంకా సెట్స్ పైకి రాలేదు. డిసెంబర్ మొదటి వారంలో ఈ మూవీ షూటింగ్ స్టార్టవుతుంది. అయితే సినిమా షూటింగ్ స్టార్టవ్వకపోయినా.. పుకార్లు మాత్రం అప్పుడే స్టార్టయిపోయాయి. రూమర్లు నమ్మొద్దంటూ రాజమౌళి స్వయంగా ప్రకటించినా, రోజుకో వార్త హల్ చల్ చేస్తూనే ఉంది. గతంలో సూర్య, శ్రియ ఇందులో నటిస్తున్నారంటూ వార్తలొచ్చాయి. కానీ ఆ పుకార్లను ఆ ఇద్దరు నటులు ఖండించారు. తాజాగా పార్ట్-2లో మాధురీదీక్షిత్ నటించనుందే పుకారు టాలీవుడ్ లో షికారు చేస్తోంది. పార్ట్-2లో […]

బాహుబలి-2పై పుకార్లు నిజమేనా..?
X
బాహుబలి పార్ట్-2 ఇంకా సెట్స్ పైకి రాలేదు. డిసెంబర్ మొదటి వారంలో ఈ మూవీ షూటింగ్ స్టార్టవుతుంది. అయితే సినిమా షూటింగ్ స్టార్టవ్వకపోయినా.. పుకార్లు మాత్రం అప్పుడే స్టార్టయిపోయాయి. రూమర్లు నమ్మొద్దంటూ రాజమౌళి స్వయంగా ప్రకటించినా, రోజుకో వార్త హల్ చల్ చేస్తూనే ఉంది. గతంలో సూర్య, శ్రియ ఇందులో నటిస్తున్నారంటూ వార్తలొచ్చాయి. కానీ ఆ పుకార్లను ఆ ఇద్దరు నటులు ఖండించారు. తాజాగా పార్ట్-2లో మాధురీదీక్షిత్ నటించనుందే పుకారు టాలీవుడ్ లో షికారు చేస్తోంది. పార్ట్-2లో అనుష్క అక్కగా మాధురీ దీక్షిత్ కనిపించనుందంటూ వార్తలొస్తున్నాయి. బాహుబలి పార్ట్-2కు బాలీవుడ్ లో మరింత క్రేజ్ తీసుకురావాలనే ఉద్దేశంతో, కథలో మార్పులు చేసి మాధురీ దీక్షిత్ కు స్థానం కల్పించారంటూ వార్తలొచ్చాయి. కానీ ఈ వార్తల్లో నిజమెంత అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. రాజమౌళి దీనిపై స్పందించకపోయినా.. మాధురీ దీక్షిత్ మాత్రం రియాక్ట్ అయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే.. వచ్చే వారం మాధురీదీక్షిత్ హైదరాబాద్ వస్తోంది. అప్పుడు బాహుబలి-2పై ఆమె స్పష్టత ఇస్తుంది.
First Published:  30 Oct 2015 7:03 PM GMT
Next Story