Telugu Global
CRIME

మోసం చేసిందని... అత్యాచారం చేశారు

తనను నమ్మించి మోసం చేసిన ఓ మహిళకు బుద్ధి చెప్పాలనుకున్న ఓ ప్రబుద్ధుడు ఏకంగా ఆమెపై అత్యాచారానికి పథకం పన్నాడు. తనొక్కడే కాకుండా తనతోపాటు మరో బాధితుడ్ని కూడా వెంటేసుకుని ఆ దారుణానికి తెగించాడు. వివరాల్లోకి వెళితే… నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన ఓ మహిళ అక్కడ ఓ ప్రయివేటు కంపెనీలో పని చేస్తోంది. ఈమెతో గుంటూరు జిల్లా మూగచింతలపాలెం గ్రామానికి చెందిన రామలింగయ్యతో మాటామాటా కలిసింది. ఆమెకు పూర్వ అనుభవంలో కొంత పూజలు చేసే అలవాటుంది. […]

మోసం చేసిందని... అత్యాచారం చేశారు
X

తనను నమ్మించి మోసం చేసిన ఓ మహిళకు బుద్ధి చెప్పాలనుకున్న ఓ ప్రబుద్ధుడు ఏకంగా ఆమెపై అత్యాచారానికి పథకం పన్నాడు. తనొక్కడే కాకుండా తనతోపాటు మరో బాధితుడ్ని కూడా వెంటేసుకుని ఆ దారుణానికి తెగించాడు. వివరాల్లోకి వెళితే… నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన ఓ మహిళ అక్కడ ఓ ప్రయివేటు కంపెనీలో పని చేస్తోంది. ఈమెతో గుంటూరు జిల్లా మూగచింతలపాలెం గ్రామానికి చెందిన రామలింగయ్యతో మాటామాటా కలిసింది. ఆమెకు పూర్వ అనుభవంలో కొంత పూజలు చేసే అలవాటుంది. దీన్ని ఆసరా చేసుకుని రామలింగయ్య తనకు తెలిసిన వారికి పూజలు చేస్తే డబ్బు వస్తుందని, ఆ డబ్బులో సగం తనకు ఇస్తే ఏర్పాటు చేస్తానని చెప్పాడు. ఆమె దానికి అంగీకరించి రామలింగయ్య దగ్గరకు వెళ్ళింది. వీరిద్దరూ కలిసి మూగచింతలపాలేనికి చెందిన వెంకటసుబ్బయ్య అనే వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఆయన భార్యకు క్షుద్రపూజలు చేసి రూ. 12 వేలు రాబట్టారు. ఈ మొత్తాన్ని సదరు మహిళ తీసుకుని ఉడాయించింది. దీంతో ఆగ్రహం చెందిన రామలింగయ్య అవకాశం కోసం చూశాడు. కొంతకాలానికి మళ్ళీ ఎలాగోలా ఆమెతో మాటలు కలిపి ఈసారి రూ. 40 వేలకు క్షుద్రపూజకు అంగీకారం కుదిరిందని మహిళను రప్పించాడు. సరిగ్గా ఇదే సమయంలో వెంకటసుబ్బయ్య కూడా తన భార్యకు తగ్గలేదని, డబ్బు వాపసు ఇవ్వాలని రామలింగయ్యను నిలదీయడంతో ఈ ఇద్దరూ ఆమె దగ్గరికి వెళ్ళి ఓ పథకం ప్రకారం క్షుద్రపూజలు చేయాలన్న వంకతో సదరు మహిళను ప్రకాశం జిల్లా కురిచేడు మండలం పడమర నాయుడుపాలెం తీసుకువెళ్ళారు. అక్కడ వీవై కాలనీలోకి తీసుకెళ్ళి ఆమె చీరతోనే చెట్టుకు కట్టేసి ఇద్దరూ కలిసి అత్యాచారానికి ఒడిగట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

First Published:  25 Oct 2015 10:56 PM GMT
Next Story