Telugu Global
Others

ప్రత్యేక చర్య- మోదీ మట్టికి మట్టి

పార్లమెంట్‌ మట్టి, యమున జలాలతో ఏపీ ప్రత్యేక హోదాపై నీళ్లు చల్లిన మోదీకి రివర్స్‌లో పార్శిల్స్‌ పంపేందుకు ఏపీకాంగ్రెస్ సిద్ధమైంది. మట్టి సత్యాగ్రహం పేరుతో 16 వేల గ్రామాల నుంచి మట్టి సేకరించి ప్రధాని మోదీకి పంపుతున్నట్టు రఘువీరారెడ్డి ప్రకటించారు. తాము పంపబోయేది మట్టికాదని అది జనం ఘోష అని అన్నారు. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె, వెంకయ్యనాయుడు సొంతూరు చెవటవారి పల్లి నుంచి కూడా మట్టి సేకరించి పీఎమ్‌కు పంపుతామన్నారు.  రాయలసీమ రాళ్ల సీమగాను, ఉత్తరాంధ్ర ఉత్తి […]

ప్రత్యేక చర్య- మోదీ మట్టికి మట్టి
X

పార్లమెంట్‌ మట్టి, యమున జలాలతో ఏపీ ప్రత్యేక హోదాపై నీళ్లు చల్లిన మోదీకి రివర్స్‌లో పార్శిల్స్‌ పంపేందుకు ఏపీకాంగ్రెస్ సిద్ధమైంది. మట్టి సత్యాగ్రహం పేరుతో 16 వేల గ్రామాల నుంచి మట్టి సేకరించి ప్రధాని మోదీకి పంపుతున్నట్టు రఘువీరారెడ్డి ప్రకటించారు. తాము పంపబోయేది మట్టికాదని అది జనం ఘోష అని అన్నారు.
చంద్రబాబు సొంతూరు నారావారిపల్లె, వెంకయ్యనాయుడు సొంతూరు చెవటవారి పల్లి నుంచి కూడా మట్టి సేకరించి పీఎమ్‌కు పంపుతామన్నారు. రాయలసీమ రాళ్ల సీమగాను, ఉత్తరాంధ్ర ఉత్తి ఆంధ్రాగా మారకూడదన్నారు. ప్రత్యేక విమానంలో తిరుగుతూ వంద కోట్లు తగలేసిన చంద్రబాబు… సామాన్యులు కనీసం ఆర్టీసీ బస్సు కూడా ఎక్కకుండా చార్జీలు పెంచారని రఘువీరా విమర్శించారు.

First Published:  24 Oct 2015 4:41 AM GMT
Next Story