Telugu Global
NEWS

ఫ్యాక్షనిస్టుల దాడిలో వైసీపీ నేత దారుణ హత్య

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షనిజం మళ్లీ పడగ విప్పింది. జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం చింతకుంటలో బుధవారం పాతకక్షలు భగ్గుమన్నాయి. వైసీపీ నేత రాఘవరెడ్డిపై ప్రత్యర్థులు దాడి చేసి అతన్ని హతమార్చారు. రాఘవరెడ్డి ప్రయాణిస్తున్న ఇన్నోవాను టిప్పర్‌తో ఢీకొట్టించారు. అనంతరం ఆయన కళ్లలో కారం చల్లి నరికేందుకు ప్రయత్నించారు. ఆయనతో ఉన్న అనుచరులు అడ్డుపడడంతో రాఘవరెడ్డి అక్కడ నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటనలో ప్రత్యర్థుల దాడిలో రాఘవరెడ్డితోపాటు ఆయన అనుచరులు నలుగురికి తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో వారిని కర్నూలు ఆస్పత్రికి […]

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షనిజం మళ్లీ పడగ విప్పింది. జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం చింతకుంటలో బుధవారం పాతకక్షలు భగ్గుమన్నాయి. వైసీపీ నేత రాఘవరెడ్డిపై ప్రత్యర్థులు దాడి చేసి అతన్ని హతమార్చారు. రాఘవరెడ్డి ప్రయాణిస్తున్న ఇన్నోవాను టిప్పర్‌తో ఢీకొట్టించారు. అనంతరం ఆయన కళ్లలో కారం చల్లి నరికేందుకు ప్రయత్నించారు. ఆయనతో ఉన్న అనుచరులు అడ్డుపడడంతో రాఘవరెడ్డి అక్కడ నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటనలో ప్రత్యర్థుల దాడిలో రాఘవరెడ్డితోపాటు ఆయన అనుచరులు నలుగురికి తీవ్రమైన గాయాలయ్యాయి. దీంతో వారిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. కర్నూలులోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాఘవరెడ్డి మరణించారు. నలుగురిని హత్య చేసిన కేసులో రాఘవరెడ్డి నిందితుడుగా ఉన్నారు. ప్రస్తుతం చింతకుంటలో పరిస్థితి ఉద్రిక్తంగా తయారైంది. రాఘవరెడ్డి హత్యకు ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రత్యర్థులు ప్రయత్నిస్తారన్న సమాచారం అందడంతో పోలీసులు భారీ ఎత్తున మోహరించేందుకు సిద్ధమవుతున్నారు.

First Published:  14 Oct 2015 12:15 PM GMT
Next Story