హీరో విశాల్పై కేసు!
నడిగర్ సంఘం ఎన్నికలు నువ్వా? నేనా? అన్నట్లుగా సాగుతున్నాయి. నిన్న మొన్నటిదాకా వ్యాఖ్యలు, దూషణలకే పరిమితమైన నటులు తాజాగా ఒకరిపై మరొకరు కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా నటుడు శరత్కుమార్ హీరో విశాల్పై శుక్రవారం క్రిమినల్ కేసు దాఖలు చేశారు. నడిగర్ సంఘానికి ఈనెల18న ఎన్నికలు జరగనున్నాయి. ఇరువర్గాలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎవరు గెలుస్తారన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు తెరతీసింది. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో శరత్కుమార్ తరఫున ప్రచారం […]
నడిగర్ సంఘం ఎన్నికలు నువ్వా? నేనా? అన్నట్లుగా సాగుతున్నాయి. నిన్న మొన్నటిదాకా వ్యాఖ్యలు, దూషణలకే పరిమితమైన నటులు తాజాగా ఒకరిపై మరొకరు కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా నటుడు శరత్కుమార్ హీరో విశాల్పై శుక్రవారం క్రిమినల్ కేసు దాఖలు చేశారు. నడిగర్ సంఘానికి ఈనెల18న ఎన్నికలు జరగనున్నాయి. ఇరువర్గాలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎవరు గెలుస్తారన్నది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఒకరిపై ఒకరు వ్యక్తిగత దూషణలకు తెరతీసింది. ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో శరత్కుమార్ తరఫున ప్రచారం చేస్తోన్న హీరో శింబు తీవ్ర వ్యాఖ్యలతో చెలరేగిపోయారు. విశాల్పై దూషణలకు పాల్పడ్డారు. దీంతో ఈవిషయంపై జాతీయస్థాయిలో దుమారం చెలరేగింది. మరోవైపు ఎన్నికల తేదీ వెలువడిన నాటి నుంచి అవినీతి, అక్రమాలు అంటూ అనేక ఆరోపణలతో హీరో విశాల్ తన పరువుకు నష్టం కలిగించాడని ఆరోపిస్తూ శరత్కుమార్ శుక్రవారం ఎగ్మూరు కోర్టులో క్రిమినల్ కేసు దాఖలు చేశారు. ఈ సమాచారం అందుకున్న విశాల్ తీవ్రంగా స్పందిస్తూ తాను కూడా త్వరలో శరత్కుమార్పై కేసును పెడతానని ప్రకటించారు.