Telugu Global
NEWS

ఎన్టీఆర్‌ వల్లే రాయలసీమలో బియ్యం తింటున్నారా?

వరల్డ్ ఎగ్‌ డే సందర్భంగా విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులను వివరిస్తూ రాయలసీమలో ఆహారపు అలవాటును ప్రస్తావించారు. ఒకప్పుడు రాయలసీమలో రాగిసంకటి, గొడ్డుకారం తినేవారని చెప్పారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి రెండు రూపాయలకే కిలోబియ్యం ఇచ్చారని చెప్పారు. ఈ రోజు వెనుకబడిన ప్రాంతాల్లో బియ్యం తినే పరిస్థితి వచ్చిందంటే అందుకు ఎన్టీఆరే కారణమని చంద్రబాబు చెప్పారు. అంతే కాదు చికెన్ ఎక్కువగా తినడం […]

ఎన్టీఆర్‌ వల్లే రాయలసీమలో బియ్యం తింటున్నారా?
X

వరల్డ్ ఎగ్‌ డే సందర్భంగా విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులను వివరిస్తూ రాయలసీమలో ఆహారపు అలవాటును ప్రస్తావించారు. ఒకప్పుడు రాయలసీమలో రాగిసంకటి, గొడ్డుకారం తినేవారని చెప్పారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టి రెండు రూపాయలకే కిలోబియ్యం ఇచ్చారని చెప్పారు. ఈ రోజు వెనుకబడిన ప్రాంతాల్లో బియ్యం తినే పరిస్థితి వచ్చిందంటే అందుకు ఎన్టీఆరే కారణమని చంద్రబాబు చెప్పారు.

అంతే కాదు చికెన్ ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందన్నారు. ఆహారంలో చికెన్ బెస్ట్‌ ఫుడ్ అన్నారు. చికెన్ తినడం వల్ల కొవ్వు కూడా పెరగదని వరల్డ్ ఎగ్ డే సందర్భంగా చంద్రబాబు విజయవాడలో చెప్పారు.

First Published:  8 Oct 2015 11:59 PM GMT
Next Story