ఫ్లైట్ మిస్... జగన్ దీక్షకు స్వల్ప అంతరాయం
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి గుంటూరులో తలపెట్టిన దీక్షకు కొంచెం అంతరాయం కలిగింది. ఆయన హైదరాబాద్లో ఎక్కాల్సిన విమానం మిస్సయ్యింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండుతో గుంటూరులో దీక్ష చేపట్టేందుకు శంషాబాద్ నుంచి విజయవాడకు విమానంలో వెళ్లాల్సిన జగన్ ఎయిర్పోర్టుకు ఆలస్యంగా రావడంతో విమానం వెళ్ళిపోయింది. దీంతో జగన్ రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. ఉదయం పది గంటలకు జగన్ నందిగామ చేరుకుంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. వాస్తవానికి ఆయన […]
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి గుంటూరులో తలపెట్టిన దీక్షకు కొంచెం అంతరాయం కలిగింది. ఆయన హైదరాబాద్లో ఎక్కాల్సిన విమానం మిస్సయ్యింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండుతో గుంటూరులో దీక్ష చేపట్టేందుకు శంషాబాద్ నుంచి విజయవాడకు విమానంలో వెళ్లాల్సిన జగన్ ఎయిర్పోర్టుకు ఆలస్యంగా రావడంతో విమానం వెళ్ళిపోయింది. దీంతో జగన్ రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు. ఉదయం పది గంటలకు జగన్ నందిగామ చేరుకుంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటున్నారు. వాస్తవానికి ఆయన దీక్ష ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కావాల్సి ఉంది. కాని ఆయన ఎక్కాల్సిన విమానం మిస్ కావడంతో రెండుమూడు గంటలు ఆలస్యంగా దీక్ష ప్రారంభిస్తారని చెబుతున్నారు. ముందు విజయవాడకు చేరుకుని కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్న అనంతరం ఆయన గుంటూరుకు వెళ్లి దీక్ష చేపడతారని పార్టీ నాయకులు తెలిపారు.