Telugu Global
National

ఛత్తీస్‌గఢ్‌లో ఏడుగురు నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. ఇందులో ఒక మహిళా మావో కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌ జిల్లా దర్భాఘాట్‌ వద్ద కూబింగ్‌ జరుపుతున్న పోలీసులకు నక్సల్స్‌ ఎదురయ్యారు. వీరిని చూసిన వెంటనే కాల్పులు జరపడం మొదలు పెట్టడంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఇరుపక్షాల మధ్య దాదాపు గంటపాటు కాల్పులు, ఎదురుకాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా నక్సల్స్‌తోపాటు ఆరుగురు మావోలు చనిపోయినట్టు చెబుతున్నారు. […]

ఛత్తీస్‌గఢ్‌లో ఏడుగురు నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌
X

చత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు చనిపోయారు. ఇందులో ఒక మహిళా మావో కూడా ఉన్నట్టు తెలుస్తోంది ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌ జిల్లా దర్భాఘాట్‌ వద్ద కూబింగ్‌ జరుపుతున్న పోలీసులకు నక్సల్స్‌ ఎదురయ్యారు. వీరిని చూసిన వెంటనే కాల్పులు జరపడం మొదలు పెట్టడంతో పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఇరుపక్షాల మధ్య దాదాపు గంటపాటు కాల్పులు, ఎదురుకాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళా నక్సల్స్‌తోపాటు ఆరుగురు మావోలు చనిపోయినట్టు చెబుతున్నారు. కాగా ఛత్తీస్‌గఢ్‌లోనే మరోచోట ముగ్గురు మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి దాదాపు కిలో ఆర్డీఎక్స్‌ స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

First Published:  7 Oct 2015 3:00 AM GMT
Next Story