Telugu Global
Others

ఆవు జోలికి వస్తే అడ్డంగా నరికేస్తా!

వివాదాస్పద వ్యాఖ్యలతోనే మీడియాలో కనిపించే బీజేపీ ఎంపీ సాక్షిమహారాజ్ మరోసారి ఆ టైప్ వ్యాఖ్యలే చేశారు. ఎవరైనా గోవు జోలికి వస్తే చంపేస్తామని హెచ్చరిచారు. ఆవు ప్రాణాలు కాపాడేందుకు చంపేందుకైనా చచ్చేందుకైనా సిద్ధమని ప్రకటించారు. ”మా అమ్మను చంపుతుంటే ఇంకా చూస్తూ ఊరుకోలేం. అమ్మను రక్షించుకునేందుకు చంపడానికి లేదా చవడానికి మేం సిద్దం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంలో రాజకీయాలు చేస్తోంది” అని మహారాజ్ వ్యాఖ్యానించారు. ఇటీవల గోవు మాంసం తిన్నాడంటూ కొందరి చేతిలో హత్యకు గురైన […]

ఆవు జోలికి వస్తే అడ్డంగా నరికేస్తా!
X

వివాదాస్పద వ్యాఖ్యలతోనే మీడియాలో కనిపించే బీజేపీ ఎంపీ సాక్షిమహారాజ్ మరోసారి ఆ టైప్ వ్యాఖ్యలే చేశారు. ఎవరైనా గోవు జోలికి వస్తే చంపేస్తామని హెచ్చరిచారు. ఆవు ప్రాణాలు కాపాడేందుకు చంపేందుకైనా చచ్చేందుకైనా సిద్ధమని ప్రకటించారు. ”మా అమ్మను చంపుతుంటే ఇంకా చూస్తూ ఊరుకోలేం. అమ్మను రక్షించుకునేందుకు చంపడానికి లేదా చవడానికి మేం సిద్దం. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశంలో రాజకీయాలు చేస్తోంది” అని మహారాజ్ వ్యాఖ్యానించారు.

ఇటీవల గోవు మాంసం తిన్నాడంటూ కొందరి చేతిలో హత్యకు గురైన వ్యక్తి కుటుంబానికి 45 లక్షలు ఇచ్చేందుకు సిద్ధమైన యూపీ సీఎం అఖిలేష్ యాదవ్… అదే రాష్ట్రంలో ఇద్దరు మైనర్ బాలికలు అత్యాచారానికి గురై చనిపోతే పరిహారం ఎందుకు ఇవ్వలేదని సాక్షి మహారాజ్ ప్రశ్నించారు.

First Published:  6 Oct 2015 5:02 AM GMT
Next Story