Telugu Global
CRIME

విద్యుదాఘాతంతో మూడు నిండు ప్రాణాలు బలి

విద్యుత్ మూడు నిందు ప్రాణాలు బలిగొంది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరి నాయుడు పల్లిలో విద్యుత్‌ స్తంభంపై మరమత్తులు చేస్తుండగా ముగ్గురు ఉద్యోగులు విద్యుదాఘాతంతో దుర్మరణం పాలయ్యారు. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఫీజులు తీసి వచ్చిన ఎవరో వాటిని ఆన్‌ చేయడం వల్ల వీరు దుర్మరణానికి గురైనట్టు చెబుతున్నారు. ఈ సంఘటనలో లైన్‌మెన్‌ వేణు, అసిస్టెంట్‌ లైన్‌మెన్‌లు శ్రీను మరో వ్యక్తి మరణించారు. మృతుల కుటుంబాల్లో ఈ సంఘటన విషాదం నింపింది. బాధిత కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

విద్యుత్ మూడు నిందు ప్రాణాలు బలిగొంది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కదిరి నాయుడు పల్లిలో విద్యుత్‌ స్తంభంపై మరమత్తులు చేస్తుండగా ముగ్గురు ఉద్యోగులు విద్యుదాఘాతంతో దుర్మరణం పాలయ్యారు. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఫీజులు తీసి వచ్చిన ఎవరో వాటిని ఆన్‌ చేయడం వల్ల వీరు దుర్మరణానికి గురైనట్టు చెబుతున్నారు. ఈ సంఘటనలో లైన్‌మెన్‌ వేణు, అసిస్టెంట్‌ లైన్‌మెన్‌లు శ్రీను మరో వ్యక్తి మరణించారు. మృతుల కుటుంబాల్లో ఈ సంఘటన విషాదం నింపింది. బాధిత కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

First Published:  2 Oct 2015 3:05 PM GMT
Next Story