Telugu Global
Others

మంత్రిగారికి మండింది... బిందె పగిలింది !

కూల్‌గా క‌నిపించే ఏపీ సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి కోపమొచ్చింది. తనలోకి కోపం అనే కోణాన్ని చూపించి మహిళలు, అధికారులను హడలెత్తించారు. అనంతపురం జిల్లా నల్లమాడ మండలం దొన్నికోటలో మంత్రి రఘునాథరెడ్డి శనివారం పర్యటించారు. అయితే చాలాకాలంగా తీవ్ర మంచినీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్న మహిళలు మంత్రిని ఘెరావ్ చేశారు. రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించి మంత్రి ముందుకెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మంత్రి ఒక్కసారిగా సహనం కోల్పోయారు. తమషాగా ఉందా అంటూ మహిళలపై ఓ […]

మంత్రిగారికి మండింది... బిందె పగిలింది !
X

కూల్‌గా క‌నిపించే ఏపీ సమాచార, ఐటీ శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి కోపమొచ్చింది. తనలోకి కోపం అనే కోణాన్ని చూపించి మహిళలు, అధికారులను హడలెత్తించారు.

అనంతపురం జిల్లా నల్లమాడ మండలం దొన్నికోటలో మంత్రి రఘునాథరెడ్డి శనివారం పర్యటించారు. అయితే చాలాకాలంగా తీవ్ర మంచినీటి ఎద్దడితో ఇబ్బంది పడుతున్న మహిళలు మంత్రిని ఘెరావ్ చేశారు. రోడ్డుపై ఖాళీ బిందెలతో బైఠాయించి మంత్రి ముందుకెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మంత్రి ఒక్కసారిగా సహనం కోల్పోయారు.

తమషాగా ఉందా అంటూ మహిళలపై ఓ రేంజ్‌ కస్సుబుస్సులాడారు. ఖాళీ బిందెలు విసిరికొట్టారు. ఇంకోసారి ఖాళీబిందెలతో కలిపిస్తే అసలు ఏ పని చేయనని హెచ్చరించారు. పక్కనే ఉన్న అధికారులపైనా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరేం చేస్తున్నారయ్యా అంటూ మండిపడ్డారు. కూల్‌గా కనిపించే తమ మంత్రి ఒక్కసారి ఫైర్ అవడంతో మహిళలు బిత్తరపోయారు.

First Published:  3 Oct 2015 9:43 AM GMT
Next Story