Telugu Global
Cinema & Entertainment

ఇద్దరు హీరోలకు ఒకే కథ వినిపించాడు..

హరీష్ శంకర్ అప్పుడే బాగా ముదిరిపోయాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా తర్వాత మరో కథ సిద్ధం చేసుకున్న ఈ గబ్బర్ సింగ్ దర్శకుడు ఆ కథను ఒకేసారి ఇద్దరు హీరోలకు వినిపించాడు. ఓ మాంఛి మాస్ మసాలా కథ రాసుకున్నాడు హరీష్. దాదాపు 60శాతం స్క్రీన్ ప్లే కూడా సిద్ధం చేశాడు. ఆ కథను ఒకేసారి అటు పవన్ కల్యాణ్ కు, ఇటు రవితేజకు వినిపించాడట హరీష్. అయితే ఆ హీరోలిద్దరూ ప్రస్తుతానికి ఆ స్టోరీని […]

ఇద్దరు హీరోలకు ఒకే కథ వినిపించాడు..
X
హరీష్ శంకర్ అప్పుడే బాగా ముదిరిపోయాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా తర్వాత మరో కథ సిద్ధం చేసుకున్న ఈ గబ్బర్ సింగ్ దర్శకుడు ఆ కథను ఒకేసారి ఇద్దరు హీరోలకు వినిపించాడు. ఓ మాంఛి మాస్ మసాలా కథ రాసుకున్నాడు హరీష్. దాదాపు 60శాతం స్క్రీన్ ప్లే కూడా సిద్ధం చేశాడు. ఆ కథను ఒకేసారి అటు పవన్ కల్యాణ్ కు, ఇటు రవితేజకు వినిపించాడట హరీష్. అయితే ఆ హీరోలిద్దరూ ప్రస్తుతానికి ఆ స్టోరీని పెండింగ్ లోనే పెట్టారు. ఎందుకంటే.. పవన్ ప్రస్తుతం సర్దార్ గబ్బర్ సింగ్ పనిలో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటాడు. మరోవైపు రవితేజ బెంగాల్ టైగర్ కు ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో బిజీగా ఉన్నాడు. మరో వారం, పది రోజులు గడిచిన తర్వాత మాత్రమే హరీష్ కథపై ఓ క్లారిటీకి వస్తాడు. సో.. అప్పటివరకు హరీష్ కు ఈ వెయిటింగ్ తప్పదు. మరి ఈ దర్శకుడు చెప్పిన కథకు పవన్ ఓకే చెబుతాడా.. లేక మాస్ రాజా గ్రీన్ సిగ్నల్ ఇస్తాడా అనేది వేచి చూడాలి. మరోవైపు అల్లు అర్జున్ కూడా హరీష్ తో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
First Published:  2 Oct 2015 7:04 PM GMT
Next Story