Telugu Global
CRIME

నిద్రిస్తున్న కూతుళ్ల‌కు నిప్పంటించిన తండ్రి

కుటుంబ క‌ల‌హాలు అభం శుభం తెలియ‌ని ఇద్ద‌రు చిన్నారులను పొట్ట‌న‌బెట్టుకున్నాయి. క‌న్న‌తండ్రే కాల‌య‌ముడై నిద్రిస్తున్న  చిన్నారుల‌పై కిరోసిన్ పోసి నిప్పంటించిన అమాన‌వీయ ఘ‌ట‌న ఖ‌మ్మంలో చోటు చేసుకుంది. వివ‌రాలు..ఖమ్మం నగరంలోని వికలాంగుల కాలనీలో అన్వర్‌పాషా(35) అనే వ్య‌క్తి కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. ఇత‌నికి రేష్మ(11),  రహీమా(6) అనే ఇద్దు కూతుళ్లు ఉన్నారు. కొంత‌కాలంగా వీరి కుటుంబంలో క‌ల‌హాలు రేగుతున్నాయి. వీటితో విసుగు చెందిన అన్వ‌ర్ పాషా నిద్రిస్తున్న తన ఇద్ద‌రు కూతుళ్ల‌పై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. అనంత‌రం తానూ […]

కుటుంబ క‌ల‌హాలు అభం శుభం తెలియ‌ని ఇద్ద‌రు చిన్నారులను పొట్ట‌న‌బెట్టుకున్నాయి. క‌న్న‌తండ్రే కాల‌య‌ముడై నిద్రిస్తున్న చిన్నారుల‌పై కిరోసిన్ పోసి నిప్పంటించిన అమాన‌వీయ ఘ‌ట‌న ఖ‌మ్మంలో చోటు చేసుకుంది. వివ‌రాలు..ఖమ్మం నగరంలోని వికలాంగుల కాలనీలో అన్వర్‌పాషా(35) అనే వ్య‌క్తి కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. ఇత‌నికి రేష్మ(11), రహీమా(6) అనే ఇద్దు కూతుళ్లు ఉన్నారు. కొంత‌కాలంగా వీరి కుటుంబంలో క‌ల‌హాలు రేగుతున్నాయి. వీటితో విసుగు చెందిన అన్వ‌ర్ పాషా నిద్రిస్తున్న తన ఇద్ద‌రు కూతుళ్ల‌పై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. అనంత‌రం తానూ ఒంటికి నిప్పంటించుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌లో అన్వ‌ర్‌పాషా, అత‌ని చిన్న కుమార్తె ర‌హీమా అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. తీవ్ర గాయాల‌తో రేష్మ ఆసుప‌త్రిలో ప్రాణం కోసం పోరాడుతోంది. కుటుంబ క‌ల‌హాలే ఈ దారుణానికి ఒడిగ‌ట్టేలా చేశాయ‌ని పోలీసులు తెలిపారు.

First Published:  1 Oct 2015 3:00 PM GMT
Next Story