Telugu Global
NEWS

ఆశా వర్కర్లను ఆంధ్రా కుక్కలు ఆడిస్తున్నాయి: మంత్రి

తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా పర్యటనలో ఆశా వర్కర్లనుద్దేశించి కఠినంగా మాట్లాడారు.  వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల గ్రామంలో పర్యటించిన మంత్రిని కలిసిన ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో మంత్రి సహనం కోల్పోయారు. ఆశా వర్కర్ల డిమాండ్ల న్యాయబద్దమైనవి కావని తేల్చేశారు. అసలు మీరు ప్రభుత్వ ఉద్యోగులే కాదని… అలాంటప్పుడు మీ సమస్యలను ప్రభుత్వం ఎందుకు పరిష్కరించాలని […]

ఆశా వర్కర్లను ఆంధ్రా కుక్కలు ఆడిస్తున్నాయి: మంత్రి
X
తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరంగల్ జిల్లా పర్యటనలో ఆశా వర్కర్లనుద్దేశించి కఠినంగా మాట్లాడారు. వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలం కోమల్ల గ్రామంలో పర్యటించిన మంత్రిని కలిసిన ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సమయంలో మంత్రి సహనం కోల్పోయారు. ఆశా వర్కర్ల డిమాండ్ల న్యాయబద్దమైనవి కావని తేల్చేశారు. అసలు మీరు ప్రభుత్వ ఉద్యోగులే కాదని… అలాంటప్పుడు మీ సమస్యలను ప్రభుత్వం ఎందుకు పరిష్కరించాలని ప్రశ్నించారు. కొన్ని ఆంధ్రా కుక్కలు మిమ్మల్ని సపోర్టు చేసి ఆడిస్తున్నాయని ఆరోపించారు. జగదీష్ రెడ్డి వ్యాఖ్యలతో ఆశా వర్కర్లు ఖంగుతిన్నారు.
First Published:  27 Sep 2015 11:02 PM GMT
Next Story