Telugu Global
Others

టీఆర్ఎస్ ఏజెంట్‌లా సోమేష్‌ కుమార్‌: ఉత్తమ్

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌ ఏజెంట్‌లా, రాజకీయ నాయకుల తొత్తుగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సనత్‌నగర్‌లో అన్యాయంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెటిలర్ల ఓట్ల తొలగింపుపై చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇక నుంచి ఓట్లు తొలగించకుండా చర్యలు తీసుకుంటామని ఎలక్షన్‌ కమిషనర్‌ జైదీ హామీ ఇచ్చారని ఆయన వివరించారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ సోమేష్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌ ఏజెంట్‌లా, రాజకీయ నాయకుల తొత్తుగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ సనత్‌నగర్‌లో అన్యాయంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన సెటిలర్ల ఓట్ల తొలగింపుపై చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇక నుంచి ఓట్లు తొలగించకుండా చర్యలు తీసుకుంటామని ఎలక్షన్‌ కమిషనర్‌ జైదీ హామీ ఇచ్చారని ఆయన వివరించారు.
First Published:  20 Sep 2015 1:12 PM GMT
Next Story