Telugu Global
Others

రైతుల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం: కవిత

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు గత పాలకుల నిర్వాకమే కారణమని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గత పాలకుల తప్పిదాల కారణంగా రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని, గత ఏడాది పాలనలో ఎక్కడా ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా చూశామని అన్నారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఇంకా ఎన్నో కార్యక్రమాలు […]

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు గత పాలకుల నిర్వాకమే కారణమని టీఆర్‌ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గత పాలకుల తప్పిదాల కారణంగా రైతులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని, గత ఏడాది పాలనలో ఎక్కడా ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా చూశామని అన్నారు. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందని వెల్లడించారు. రైతులెవరూ స్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడవద్దని కోరారు.
First Published:  19 Sep 2015 1:10 PM GMT
Next Story