Telugu Global
Others

బాలుడి అపహరణ..రూ. కోటి డిమాండ్

హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్‌లో ఎనిమిదేళ్ల బాలుడు అపహరణకు గురైయ్యాడు. బబ్లూ అనే బాలుడు ఇంటిముందు ఆడుకుంటుండగా కారులో వచ్చిన దుండగులు కిడ్నాప్ చేశారు. పోలీసులకు చెబితే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతూ రూ. కోటి డిమాండ్ చేశారు. కిడ్నాప్‌పై బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన శనివారం సాయంత్రం 8 గంటల సమయంలో చోటుచేసుకుంది. పోలీసులకు చెబితే బాలుడిని చంపుతామని బెదిరించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు […]

హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్‌లో ఎనిమిదేళ్ల బాలుడు అపహరణకు గురైయ్యాడు. బబ్లూ అనే బాలుడు ఇంటిముందు ఆడుకుంటుండగా కారులో వచ్చిన దుండగులు కిడ్నాప్ చేశారు. పోలీసులకు చెబితే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతూ రూ. కోటి డిమాండ్ చేశారు. కిడ్నాప్‌పై బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన శనివారం సాయంత్రం 8 గంటల సమయంలో చోటుచేసుకుంది. పోలీసులకు చెబితే బాలుడిని చంపుతామని బెదిరించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఫోన్ కాల్ ఆధారంగా విచారణ చేపట్టారు.
First Published:  12 Sep 2015 1:06 PM GMT
Next Story