Telugu Global
Others

అనంతపురంలో లాకప్‌డెత్

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్‌ జరిగింది. ఓ హత్య కేసులో నిందితుడు అయిన కమ్మ శ్రీరాములును (50) విచారణ కోసం పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చి చితకబాదారు. దీంతో పోలీసుల దెబ్బలకు తాళలేక కమ్మ శ్రీరాములు అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టుం నిమిత్తమై మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీరాములును అన్యాయంగా పోలీసుల తీసుకువచ్చి చంపేశారని బంధువులు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు.

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో లాకప్‌డెత్‌ జరిగింది. ఓ హత్య కేసులో నిందితుడు అయిన కమ్మ శ్రీరాములును (50) విచారణ కోసం పోలీసులు స్టేషన్‌కు తీసుకువచ్చి చితకబాదారు. దీంతో పోలీసుల దెబ్బలకు తాళలేక కమ్మ శ్రీరాములు అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టుం నిమిత్తమై మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీరాములును అన్యాయంగా పోలీసుల తీసుకువచ్చి చంపేశారని బంధువులు పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు.
First Published:  10 Sep 2015 1:10 PM GMT
Next Story