నేపాల్ మహిళలపై సౌదీ దౌత్యవేత్త అత్యాచారం?
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగు చూసింది. ఇద్దరు నేపాల్ మహిళలపై సౌదీ దౌత్యవేత్త, ఆయన స్నేహితులు అత్యాచారం చేశారు. ఢిల్లీ శివారులోని ఓ ఖరీదైన ఫ్లాట్లో బాధిత మహిళలను బంధించి దారుణాలకు పాల్పడుతున్నారు. ఓ ఎన్జీవో సంస్థ సమాచారంతో విషయం తెలుసుకున్న గుర్గావ్ పోలీసులు ఆ ఇంటిపై రైడ్ చేసి వారిని కాపాడారు. బాధిత మహిళల ఫిర్యాదుతో సౌదీ దౌత్యవేత్త, ఆయన స్నేహితులపై అత్యాచారం కేసులు నమోదు చేశారు. అయితే సౌదీ రాయబార కార్యాలయం […]
BY admin8 Sep 2015 1:21 PM GMT
admin Updated On: 9 Sep 2015 6:11 AM GMT
దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం వెలుగు చూసింది. ఇద్దరు నేపాల్ మహిళలపై సౌదీ దౌత్యవేత్త, ఆయన స్నేహితులు అత్యాచారం చేశారు. ఢిల్లీ శివారులోని ఓ ఖరీదైన ఫ్లాట్లో బాధిత మహిళలను బంధించి దారుణాలకు పాల్పడుతున్నారు. ఓ ఎన్జీవో సంస్థ సమాచారంతో విషయం తెలుసుకున్న గుర్గావ్ పోలీసులు ఆ ఇంటిపై రైడ్ చేసి వారిని కాపాడారు. బాధిత మహిళల ఫిర్యాదుతో సౌదీ దౌత్యవేత్త, ఆయన స్నేహితులపై అత్యాచారం కేసులు నమోదు చేశారు. అయితే సౌదీ రాయబార కార్యాలయం ఈ ఆరోపణలను ఖండించింది.
Next Story