రైతు కోసం చంద్రన్న యాత్ర ప్రారంభం
శ్రీకాకుళం జిల్లా నుంచి రైతు కోసం చంద్రన్న యాత్రను మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, మృణాళినిలు ప్రారంభించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం తెలుగుదేశం ప్రభుత్వానికే సాధ్యమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పేద ప్రజలందరికీ ప్రభుత్వం చేరువగా ఉంటుందని పల్లె రఘునాథరెడ్డి అన్నారు. రైతుల కోసం ఉద్దేశించిన ఈ యాత్రలో వారి కష్టసుఖాలు తెలుసుకుంటామని మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రేషన్కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలని మంత్రి సునీతను […]
BY sarvi8 Sep 2015 1:06 PM GMT
sarvi Updated On: 9 Sep 2015 2:32 AM GMT
శ్రీకాకుళం జిల్లా నుంచి రైతు కోసం చంద్రన్న యాత్రను మంత్రులు అచ్చెన్నాయుడు, ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీత, మృణాళినిలు ప్రారంభించారు. సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడం తెలుగుదేశం ప్రభుత్వానికే సాధ్యమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. పేద ప్రజలందరికీ ప్రభుత్వం చేరువగా ఉంటుందని పల్లె రఘునాథరెడ్డి అన్నారు. రైతుల కోసం ఉద్దేశించిన ఈ యాత్రలో వారి కష్టసుఖాలు తెలుసుకుంటామని మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రేషన్కార్డులు, పెన్షన్లు మంజూరు చేయాలని మంత్రి సునీతను గుడుమూరు గ్రామస్థులు కోరారు.
Next Story