ఆసుపత్రికి తరిలిస్తుండగానే 108లో గర్భిణిని మృతి
ప్రసవ వేదనతో బాధ పడుతున్న నిండు గర్భిణిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా, పరిస్థితి విషమించి మార్గమధ్యంలోనే ఆమె కన్ను మూసింది. ఈ దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పాలవలస గ్రామం వద్ద చోటు చేసుకుంది. జిల్లాలోని సీతంపేట మండలం బిదిండిగూడ గ్రామానికి చెందిన సవర అనురాధ (22)అనే మహిళ ప్రసవ వేదనతో బాధపడుతుండగా పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో, అక్కడి డాక్టర్లు శ్రీకాకుళం ఆసుపత్రికి తీసుకెళ్లమన్నారు. దీంతో, 108 వాహనంలో […]
BY admin7 Sep 2015 1:06 PM GMT
admin Updated On: 8 Sep 2015 12:56 AM GMT
ప్రసవ వేదనతో బాధ పడుతున్న నిండు గర్భిణిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా, పరిస్థితి విషమించి మార్గమధ్యంలోనే ఆమె కన్ను మూసింది. ఈ దారుణ ఘటన శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం పాలవలస గ్రామం వద్ద చోటు చేసుకుంది. జిల్లాలోని సీతంపేట మండలం బిదిండిగూడ గ్రామానికి చెందిన సవర అనురాధ (22)అనే మహిళ ప్రసవ వేదనతో బాధపడుతుండగా పాలకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో, అక్కడి డాక్టర్లు శ్రీకాకుళం ఆసుపత్రికి తీసుకెళ్లమన్నారు. దీంతో, 108 వాహనంలో ఆమెను శ్రీకాకుళం తరలిస్తుండగా పాలవలస గ్రామం వద్దకు చేరుకునే సరికి ఆమె ప్రసవ వేదనతో ప్రాణాలు విడిచింది.
Next Story