Telugu Global
Others

టీ.ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతుల బలి: కిషన్‌రెడ్డి

రైతుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఆత్మహత్యలు పెరుగుతున్నాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఇందిరా పార్క్‌వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వం రైతులపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు. రుణమాఫీ విషయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆయన అన్నారు. రైతుల అప్పుల భారం పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని… అలాంటి కుటుంబాలను మంత్రులు గానీ, అధికారులు కానీ పరామర్శించలేదని […]

టీ.ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతుల బలి: కిషన్‌రెడ్డి
X
రైతుల సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ఆత్మహత్యలు పెరుగుతున్నాయని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం ఇందిరా పార్క్‌వద్ద బీజేపీ ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రభుత్వం రైతులపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు. రుణమాఫీ విషయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోలేదని ఆయన అన్నారు. రైతుల అప్పుల భారం పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని… అలాంటి కుటుంబాలను మంత్రులు గానీ, అధికారులు కానీ పరామర్శించలేదని కిషన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
First Published:  7 Sep 2015 1:15 PM GMT
Next Story