Telugu Global
National

కన్న కూతురినే బలి ఇచ్చిన కసాయి

క్షుద్రపూజల్లో భాగంగా కన్న కూతురినే బలి తీసుకున్నాడో కసాయి తండ్రి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌ జిల్లాలోని జగురా గ్రామంలో జరిగింది. గిరిజేశ్‌ పాల్‌ అనే వ్యక్తి ఇంట్లోనే క్షుద్రపూజలు చేస్తూ తన కుమార్తెను(9) బలి ఇచ్చాడు. అతడి భార్య సునీత, మరో ఇద్దరు పిల్లలు ఇంటికి వచ్చేసరికి తలుపులు మూసి ఉన్నాయి. సునీత తలుపు సందులోంచి లోపలికి చూడగా తన కుమార్తె రక్తపు మడుగులో పడి ఉంది. కూతురు మృతదేహం చుట్టూ భర్త నృత్యం చేయడడం […]

కన్న కూతురినే బలి ఇచ్చిన కసాయి
X
క్షుద్రపూజల్లో భాగంగా కన్న కూతురినే బలి తీసుకున్నాడో కసాయి తండ్రి. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌ జిల్లాలోని జగురా గ్రామంలో జరిగింది. గిరిజేశ్‌ పాల్‌ అనే వ్యక్తి ఇంట్లోనే క్షుద్రపూజలు చేస్తూ తన కుమార్తెను(9) బలి ఇచ్చాడు. అతడి భార్య సునీత, మరో ఇద్దరు పిల్లలు ఇంటికి వచ్చేసరికి తలుపులు మూసి ఉన్నాయి. సునీత తలుపు సందులోంచి లోపలికి చూడగా తన కుమార్తె రక్తపు మడుగులో పడి ఉంది. కూతురు మృతదేహం చుట్టూ భర్త నృత్యం చేయడడం చూసి ఆశ్చర్యానికి గురై స్థానికులను పిలిచింది. విషయాన్ని పోలీసులకు తెలపగా తలుపులు బద్దలుకొట్టి అతడిని అరెస్టు చేశారు. ఆ ఇంట్లో క్షుద్రపూజలకు సంబంధించిన వస్తువులను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు.
First Published:  8 Sep 2015 1:01 AM GMT
Next Story