Telugu Global
Others

కొత్త నంబరింగ్‌తో నకిలీ కరెన్సీకి చెక్: ఆర్‌బిఐ

నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాన్ని ప్రవేశపెడుతోంది. కరెన్సీ నోట్లలో కొత్తగా సంఖ్యా విధానాన్ని తీసుకురానుంది. ప్రత్యేకించి అధిక విలువ కల్గిన రూ.1000, రూ.500 నోట్లలో ఈ విధానం అమలు చేసి నకిలీ కరెన్సీని ని యంత్రించాలని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) భావిస్తోంది. సంఖ్య నమూనా సవరణను ప్రవేశపెట్టేందుకుగాను భారతీయ రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేటు లిమిటెడ్(బిఆర్‌బిఎన్‌ఎంపిఎల్), సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ఇండియా (ఎస్‌పిఎంసిఐఎల్)లు తగిన చర్యలు చేపడుతున్నాయి. ఈ […]

నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సరికొత్త విధానాన్ని ప్రవేశపెడుతోంది. కరెన్సీ నోట్లలో కొత్తగా సంఖ్యా విధానాన్ని తీసుకురానుంది. ప్రత్యేకించి అధిక విలువ కల్గిన రూ.1000, రూ.500 నోట్లలో ఈ విధానం అమలు చేసి నకిలీ కరెన్సీని ని యంత్రించాలని ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) భావిస్తోంది. సంఖ్య నమూనా సవరణను ప్రవేశపెట్టేందుకుగాను భారతీయ రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రన్ ప్రైవేటు లిమిటెడ్(బిఆర్‌బిఎన్‌ఎంపిఎల్), సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ఇండియా (ఎస్‌పిఎంసిఐఎల్)లు తగిన చర్యలు చేపడుతున్నాయి. ఈ నంబరింగ్ విధానాన్ని రూ.1000, రూ.500 కరెన్సీ నోట్లకు వచ్చే ఏడాది మే నాటికి ప్రారంభించనున్నారు.
First Published:  6 Sep 2015 1:21 PM GMT
Next Story