Telugu Global
Others

తెలంగాణలోకి సిరంజీ సైకో ప్రవేశం!

మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపిన సిరంజీ సైకో ఆగడాలు తెలంగాణకు చేరాయి. నగరంలోని మల్కాజ్‌గిరిలో లిల్లీ మోడల్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న రమ్య శనివారం స్కూల్‌కు వెళుతుండగా ఆగంతకుడు సిరంజీతో దాడి చేశాడు. దీనితో ఆమె సృహ కోల్పోయింది. వెంటనే స్థానికులు గమనించి రమ్యను ఆసుపత్రికి తరలించారు. ఏపీ రాష్ట్రంలో దాడులు చేస్తున్న వ్యక్తేనా? లేక ఇతరులై ఉంటారా? అనే కోణంపై పోలీసులు దృష్టి సారించారు. కాగా ఇటీవల తూర్పు, పశ్చిమ గోదావరి […]

తెలంగాణలోకి సిరంజీ సైకో ప్రవేశం!
X
మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపిన సిరంజీ సైకో ఆగడాలు తెలంగాణకు చేరాయి. నగరంలోని మల్కాజ్‌గిరిలో లిల్లీ మోడల్ స్కూల్లో నాలుగో తరగతి చదువుతున్న రమ్య శనివారం స్కూల్‌కు వెళుతుండగా ఆగంతకుడు సిరంజీతో దాడి చేశాడు. దీనితో ఆమె సృహ కోల్పోయింది. వెంటనే స్థానికులు గమనించి రమ్యను ఆసుపత్రికి తరలించారు. ఏపీ రాష్ట్రంలో దాడులు చేస్తున్న వ్యక్తేనా? లేక ఇతరులై ఉంటారా? అనే కోణంపై పోలీసులు దృష్టి సారించారు. కాగా ఇటీవల తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, విజయనగరం జిల్లాల్లో సిరంజితో అనేకమందిని బాధితుల్ని చేసిన సైకో కోసం ఆ రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడి ఊహా చిత్రాన్ని కూడా విడుదల చేశారు. ఇతడిని పట్టిచ్చిన వారికి బహుమతి కూడా ఇస్తామని పోలీసులు ప్రకటించారు. కానీ సూదితో దాడులు చేస్తున్న వ్యక్తిని మాత్రం పట్టుకోలేక పోయారు. ప్రస్తుతం తెలంగాణలో జరిగిన సంఘటనతో అతడికి సంబంధం ఉందా అనేది తెలియ రాలేదు. సిరంజితో ఇంజెక్షన్‌ చేయడం వల్లే విద్యార్థిని సృహ కోల్పోయిందా? లేక ఇతర కారణాలున్నాయా అనేది తెలియడం లేదు.
First Published:  5 Sep 2015 4:00 AM GMT
Next Story