Telugu Global
Others

గోకుల్‌చాట్‌ బాధితునికి 10లక్షల చెక్కు

గోకుల్‌ చాట్‌ పేలుళ్లలో తీవ్రంగా గాయపడిన సదాశివరెడ్డికి ప్రభుత్వం అండగా నిలిచింది. పరిహారం కింద రూ.10లక్షల చెక్కును మంత్రి కె.తారకరామారావు అతడి తల్లిదండ్రులకు గురువారం సచివాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా సదాశివరెడ్డి తల్లిదండ్రులు వసంత, మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏళ్లుగా ఎందరి చుట్టో తిరిగామని, ఎవరూ పట్టించులేదన్నారు. రెండు నెలల క్రితం సీఎం కేసీఆర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నామని, ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్‌ పరిహారం అందించారని అన్నారు. సదాశివరెడ్డి కోలుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగం […]

గోకుల్‌ చాట్‌ పేలుళ్లలో తీవ్రంగా గాయపడిన సదాశివరెడ్డికి ప్రభుత్వం అండగా నిలిచింది. పరిహారం కింద రూ.10లక్షల చెక్కును మంత్రి కె.తారకరామారావు అతడి తల్లిదండ్రులకు గురువారం సచివాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా సదాశివరెడ్డి తల్లిదండ్రులు వసంత, మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఏళ్లుగా ఎందరి చుట్టో తిరిగామని, ఎవరూ పట్టించులేదన్నారు. రెండు నెలల క్రితం సీఎం కేసీఆర్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్నామని, ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్‌ పరిహారం అందించారని అన్నారు. సదాశివరెడ్డి కోలుకున్న తర్వాత ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
First Published:  3 Sep 2015 1:17 PM GMT
Next Story