Telugu Global
Others

షీనాను హత్య చేసింది నేనే: ఇంద్రాణి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న షీనాబోరా హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. షీనాను తాను హత్య చేసినట్టు  ఆమె తల్లి, ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ అంగీకరించారు. పది రోజులుగా పోలీసు విచారణకు హాజరవుతున్న ఇంద్రాణి ముఖర్జీ ఎట్టకేలకు ఇవాళ తన నేరాన్ని ఒప్పుకున్నారు. తన కుమార్తె షీనాబోరాను హత్య చేసింది తానే అని ముంబై పోలీసుల ఎదుట ఇంద్రాణి చెప్పారు. కుమారుడు, భర్త నిజాన్ని తమకు తెలిపారని, వారు అప్రూవర్లుగా మారారని చెప్పడంతో గత్యంతరం లేని […]

షీనాను హత్య చేసింది నేనే: ఇంద్రాణి
X
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న షీనాబోరా హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. షీనాను తాను హత్య చేసినట్టు ఆమె తల్లి, ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ అంగీకరించారు. పది రోజులుగా పోలీసు విచారణకు హాజరవుతున్న ఇంద్రాణి ముఖర్జీ ఎట్టకేలకు ఇవాళ తన నేరాన్ని ఒప్పుకున్నారు. తన కుమార్తె షీనాబోరాను హత్య చేసింది తానే అని ముంబై పోలీసుల ఎదుట ఇంద్రాణి చెప్పారు. కుమారుడు, భర్త నిజాన్ని తమకు తెలిపారని, వారు అప్రూవర్లుగా మారారని చెప్పడంతో గత్యంతరం లేని పరిస్థితిలో ఇంద్రాణి తన నేరాన్ని అంగీకరించారు. ఇంద్రాణి నుంచి నిజాలు రాబట్టడానికి ఖార్ స్టేషన్ పోలీసులు తీవ్రంగా శ్రమించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను విడివిడిగానూ, కలిపి కూర్చోబెట్టి ప్రశ్నించారు. ఒక దశలో ఇంద్రాణి తనను పోలీసులు కొట్టారని కూడా ఆరోపించింది. షీనాబోరా బతికే ఉందని బుధవారం అబద్దమాడిన ఇంద్రాణి… ఆమె అమెరికాలో ఉందని ఒక దశలో వాదించింది. చివరికి గురువారం నిజాన్ని అంగీకరించారు. సెప్టెంబర్ 5 వరకు ఇంద్రాణి పోలీసుల కస్టడీలో ఉంచనున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇందాణి నుంచి మరిన్ని వివరాలను పోలీసులు రాబట్టే అవకాశం ఉంది.
First Published:  3 Sep 2015 6:14 AM GMT
Next Story