Telugu Global
Others

ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యా‌ర్థి‌ని మృతి

హైదరాబాద్‌లోని దుండిగల్ పోలీస్ స్టే‌ష‌న్ పరిధిలోని బహదూర్‌పల్లి చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఎంఆర్ కాలేజీకి చెందిన విద్యార్థిని రాజేశ్వరీ(18) మృతి చెందింది. వివరాలోకి వెళితే .. చింతల్ గణేశ్ నగర్‌కు చెందిన రాజేశ్వరీ రెండో సంవత్సరం చదువుతున్న తన సోదరుడితో కలసి స్కూటీ పై కాలేజీకి వెళ్తుండగా బహదూర్‌పల్లి చౌరస్తా వద్ద అదుపు తప్పి జారిపడ్డారు. కిందపడ్డ విద్యార్థినిపై నుంచి వెనకాలే వస్తున్న ఓ కాలేజీ బస్సు వెళ్లటంతో అక్కడికక్కడే మృతి […]

హైదరాబాద్‌లోని దుండిగల్ పోలీస్ స్టే‌ష‌న్ పరిధిలోని బహదూర్‌పల్లి చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీఎంఆర్ కాలేజీకి చెందిన విద్యార్థిని రాజేశ్వరీ(18) మృతి చెందింది. వివరాలోకి వెళితే .. చింతల్ గణేశ్ నగర్‌కు చెందిన రాజేశ్వరీ రెండో సంవత్సరం చదువుతున్న తన సోదరుడితో కలసి స్కూటీ పై కాలేజీకి వెళ్తుండగా బహదూర్‌పల్లి చౌరస్తా వద్ద అదుపు తప్పి జారిపడ్డారు. కిందపడ్డ విద్యార్థినిపై నుంచి వెనకాలే వస్తున్న ఓ కాలేజీ బస్సు వెళ్లటంతో అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆ ప్రాంతమంతా విషాదం నెలకొంది. విద్యార్థిని మృతితో కాలేజీ యాజమాన్యం మంగళవారం సెలవు ప్రకటించింది.
First Published:  31 Aug 2015 1:08 PM GMT
Next Story