Telugu Global
Others

చంద్రబాబు పోన్ చేస్తేనే బిజెపిలో చేరా: జగ్గారెడ్డి

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోన్ చేయడం వల్లే తాను బిజెపిలో చేరానని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. గాంధీభవన్‌లో ఆయన తిరిగి కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకున్నారు. గతంలో చేసిన తప్పు తిరిగి చేయబోనని అన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారని, ఇదే మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతుందని జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణను తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన గుర్తు చేశారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లో […]

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోన్ చేయడం వల్లే తాను బిజెపిలో చేరానని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వెల్లడించారు. గాంధీభవన్‌లో ఆయన తిరిగి కాంగ్రెస్‌ తీర్ధం పుచ్చుకున్నారు. గతంలో చేసిన తప్పు తిరిగి చేయబోనని అన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారని, ఇదే మెదక్ జిల్లాలో కాంగ్రెస్ ఎంత బలంగా ఉందో చాటి చెబుతుందని జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణను తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని ఆయన గుర్తు చేశారు. కెసిఆర్ అధికారంలోకి వచ్చిన పదహారు నెలల్లో ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం సిగ్గు అనిపించడం లేదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. తన నోటి దురుసు, ఉద్యోగుల వల్లే ఓడిపోయానని అన్నారు. కెసిఆర్ పునాదులు భవిష్యత్తులో కదులుతాయని ఆయన హెచ్చరించారు.
First Published:  30 Aug 2015 1:11 PM GMT
Next Story