Telugu Global
Cinema & Entertainment

ఇంద్రాణి ముఖర్జీపై సినిమా

ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కేసు ఇంద్రాణి ముఖర్జీ కేసు. కన్న కూతురినే హత్య చేసిన తల్లిగా ఇంద్రాణి గురించి దేశమంతా చర్చించుకుంటోంది. తన మాజీ భర్త, డ్రైవర్ తో కలిసి ఇంద్రాణి, కూతురు షీనా బోరాను హత్యచేసిందనేది ప్రధాన ఆరోపణ. ఈ మొత్తం ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇంద్రాణి, తన కన్నకూతురు షీనా బోరాను అందరికీ చెల్లెలిగా పరిచయం చేయడం.. మరో అక్రమ సంబంధం వెలుగులోకి రావడం.. మరిన్ని నిజాలు తన దగ్గరున్నాయంటూ ఇంద్రాణి […]

ఇంద్రాణి ముఖర్జీపై సినిమా
X
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కేసు ఇంద్రాణి ముఖర్జీ కేసు. కన్న కూతురినే హత్య చేసిన తల్లిగా ఇంద్రాణి గురించి దేశమంతా చర్చించుకుంటోంది. తన మాజీ భర్త, డ్రైవర్ తో కలిసి ఇంద్రాణి, కూతురు షీనా బోరాను హత్యచేసిందనేది ప్రధాన ఆరోపణ. ఈ మొత్తం ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఇంద్రాణి, తన కన్నకూతురు షీనా బోరాను అందరికీ చెల్లెలిగా పరిచయం చేయడం.. మరో అక్రమ సంబంధం వెలుగులోకి రావడం.. మరిన్ని నిజాలు తన దగ్గరున్నాయంటూ ఇంద్రాణి మరో కొడుకు స్టేట్ మెంట్ ఇవ్వడం కేసును మలుపులు మీద మలుపులు తిప్పుతోంది. ఇలాంటి రియల్ సెన్సేషన్ ను అస్సలు వదులుకోడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. వెంటనే మొబైల్ అందుకున్నాడు. ట్వీట్లు మీద ట్వీట్లు చేశాడు. ఇప్పటి వరకు తన సినిమాల్లో కూడా ఇలాంటివి చూడలేదన్నాడు. కుదిరితే ఇంద్రాణి ముఖర్జీ, షీనా బోరా పాత్రలతో ఓ సినిమా చేస్తానని ప్రకటించాడు. ఇక్కడే ఓ అనుమానాన్ని కూడా వ్యక్తంచేశాడు వర్మ.ఈ సినిమాను ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించాలా లేక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ గా తీయాలా అంటూ సందేహం వ్యక్తంచేశాడు. మొత్తమ్మీద వర్మ కన్ను అయితే ఈ కేసుపై పడింది కాబట్టి త్వరలోనే సినిమాగా రావడం ఖాయంగా కనిపిస్తోంది.
First Published:  28 Aug 2015 7:03 PM GMT
Next Story