Telugu Global
Others

అటవీ ప్రాంతంగా ఏపీలో 40 శాతం భూమి: సీఎం

విజయవాడలో సీఆర్‌డీఏ పరిధిలో హెలీకాప్టర్ ద్వారా విత్తనాలు జల్లే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. కృష్ణా జిల్లాలో 374 హెక్టార్లలో 3.71 టన్నుల వేప, చింత, తంగేడు, సుబాబుల్ విత్తనాలను హెలీకాప్టర్ ద్వారా చల్లనున్నారు. రాష్ట్రంలో 40 శాతం అటవీ ప్రాంతాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చంద్రబాబు చెప్పారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజయవాడలో ఇసుక విధానంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్రమార్కులు దాడులకు తెగించే అవకాశాలున్న […]

అటవీ ప్రాంతంగా ఏపీలో 40 శాతం భూమి: సీఎం
X
విజయవాడలో సీఆర్‌డీఏ పరిధిలో హెలీకాప్టర్ ద్వారా విత్తనాలు జల్లే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు జెండా ఊపి ప్రారంభించారు. కృష్ణా జిల్లాలో 374 హెక్టార్లలో 3.71 టన్నుల వేప, చింత, తంగేడు, సుబాబుల్ విత్తనాలను హెలీకాప్టర్ ద్వారా చల్లనున్నారు. రాష్ట్రంలో 40 శాతం అటవీ ప్రాంతాన్ని పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చంద్రబాబు చెప్పారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విజయవాడలో ఇసుక విధానంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. అక్రమార్కులు దాడులకు తెగించే అవకాశాలున్న చోట పోలీసు బందోబస్తును వెంటబెట్టుకెళ్లాలని సూచించారు.
First Published:  28 Aug 2015 1:03 PM GMT
Next Story