Telugu Global
Others

రాష్ట్రంలో వర్సిటీల ప్రక్షాళన: మంత్రి గంటా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీని మంత్రి గంటా అకస్మికంగా సందర్శించారు. అనంతరం అధికారులతో సమావేశమై ర్యాగింగ్ నిరోధక చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మీడియాతో మాట్లాడుతూ పనితీరు మార్చుకొని వీసీలను సైతం పదవుల నుండి తొలగించుకొనే విధంగా చట్టాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. యూనివర్సిటీల్లో తిష్ట వేస్తున్న బయటి వ్యక్తులను ఉపేక్షించేది లేదని, వారిని బయటకు పంపేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూనివర్సిటీల ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టినట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీని మంత్రి గంటా అకస్మికంగా సందర్శించారు. అనంతరం అధికారులతో సమావేశమై ర్యాగింగ్ నిరోధక చర్యలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మీడియాతో మాట్లాడుతూ పనితీరు మార్చుకొని వీసీలను సైతం పదవుల నుండి తొలగించుకొనే విధంగా చట్టాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. యూనివర్సిటీల్లో తిష్ట వేస్తున్న బయటి వ్యక్తులను ఉపేక్షించేది లేదని, వారిని బయటకు పంపేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
First Published:  23 Aug 2015 1:08 PM GMT
Next Story