తెలంగాణకు కేంద్రం షాక్
తాము ఇప్పటివరకు ఇచ్చిన నిధులను ఎలా ఖర్చు చేశారో లెక్కలు చెప్పండంటూ తెలంగాణా ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు తాము అనేక పద్ధుల కింద నిధులు విడుదల చేశామని, వీటిని ఎలా ఖర్చు చేశారో వివరాలను తెలియజేయాలని ఆ లేఖలో కేంద్రం కోరింది. సదరు లెక్కలు చెప్పే వరకు కొత్తగా ఇవ్వాల్సిన నిదులను విడుదల చేయలేమని స్పష్టం చేసింది. ఒకవేళ వివిధ పద్దుల కింద నిధులు మంజూరైనా ఖర్చు […]
BY sarvi17 Aug 2015 12:42 AM GMT
X
sarvi Updated On: 17 Aug 2015 12:42 AM GMT
తాము ఇప్పటివరకు ఇచ్చిన నిధులను ఎలా ఖర్చు చేశారో లెక్కలు చెప్పండంటూ తెలంగాణా ప్రభుత్వానికి కేంద్రం లేఖ రాసింది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు తాము అనేక పద్ధుల కింద నిధులు విడుదల చేశామని, వీటిని ఎలా ఖర్చు చేశారో వివరాలను తెలియజేయాలని ఆ లేఖలో కేంద్రం కోరింది. సదరు లెక్కలు చెప్పే వరకు కొత్తగా ఇవ్వాల్సిన నిదులను విడుదల చేయలేమని స్పష్టం చేసింది. ఒకవేళ వివిధ పద్దుల కింద నిధులు మంజూరైనా ఖర్చు వివరాలు తెలియజేసే వరకు వాటిని విడుదల చేయబోమని తెలిపింది. దీంతో ప్రభుత్వం కేంద్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన నిధుల వివరాలను బయటకు తీస్తోంది. వీటికి లెక్కలు రాసే పనిలో అధికారగణం నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తోంది.
Next Story